Skip to main content

సడెన్‌గా బ్యాంకాక్‌కి రాహుల్ గాంధీ... కారణం అదేనా...



 ఈ నెల చివర్లో ఎన్నికలు జరగబోయే... మహారాష్ట్ర, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఇలాంటి సమయంలో... పోరాడాల్సిన ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ... శనివారం సడెన్‌గా బ్యాంకాక్ ట్రిప్‌కి వెళ్లిపోయినట్లు తెలిసింది. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం బీజేపీయే అధికారంలో ఉంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కూడా రెండు రాష్ట్రాల్లో బీజేపీయే దుమ్మురేపింది. ఇలాంటి పరిస్థితుల్లో తల్లి, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి తోడుగా ఉంటూ... పార్టీని ముందుకు నడిపించాల్సిన బాధ్యత రాహుల్ గాంధీపై ఉంది. ఆల్రెడీ మొన్నటిదాకా పార్టీ అధ్యక్షుడిగా ఆయనే ఉన్నందువల్ల... నేతలు కూడా రాహుల్ సరైన నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తుంటే... ఆయనేమో... బ్యాంకాక్ వెళ్లిపోవడం... రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలకు మింగుడుపడని అంశంగా మారింది.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...