Skip to main content

శివసేనకు మద్దతివ్వడానికి మాకు అభ్యంతరం లేదు: కాంగ్రెస్



మహారాష్ట్రలో బీజేపీ-శివసేనల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందా? లేదా? అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిని తమకు ఇవ్వాలంటూ శివసేన పెట్టిన కండిషన్ కు బీజేపీ ససేమిరా అంటోంది. మరోవైపు ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలు మరింత గందరగోళానికి గురి చేస్తున్నాయి. శివసేనకు అసెంబ్లీ ఎన్నికల్లో 44 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు హుస్సేన్ దాల్వాయి చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

శివసేనకు మద్దతివ్వడానికి కాంగ్రెస్ కు ఎలాంటి అభ్యంతరం లేదని హుస్సేన్ అన్నారు. అయితే, ఈ విషయంలో ముందుగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. బీజేపీతో కలిసి ఉంటారో? లేక విడిపోతారో? అనే నిర్ణయాన్ని తీసుకోవాల్సింది థాకరేనే అని అన్నారు. మరోవైపు రెండు, మూడు రోజుల్లో ముంబైలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటించనున్నట్టు సమాచారం. అదే జరిగితే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో పక్కా క్లారిటి వచ్చే అవకాశం ఉంది.

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...