Skip to main content

హానీ ట్రాప్ ఉచ్చులో పడి లక్షలు సమర్పించుకున్న విశాఖ వాసులు




కిలాడి గ్యాంగ్ విసిరిన హానీ ట్రాప్ ఉచ్చులో పలువురు విశాఖ వాసులు చిక్కుకున్నారు. వారి మాటలకు పడిపోయి లక్షలు సమర్పించుకుని, లబోదిబో మంటున్నారు. ఫేక్ డేటింగ్ సైట్లతో కిలాడి గ్యాంగ్ జనాలను ట్రాప్ చేస్తోంది. కోల్ కతా కేంద్రంగా సాగుతున్న ఈ దందాకు దేశ వ్యాప్తంగా ఎంతో మంది బలవుతున్నారు. అందమైన అమ్మాయిన ఫొటోలను పెట్టి, పలు ఆకర్షనీయమైన ఆఫర్లతో జనాలను ఈ గ్యాంగ్ ట్రాప్ చేస్తోంది. గ్యాంగ్ కు చెందిన అమ్మాయిలు తీయని మాటలతో కస్టమర్లను ఆకట్టుకుని, వారి జేబులను గుల్ల చేస్తున్నారు. ఓస్లాం ఐటీ ముసుగులో ఈ దందా గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది.

విశాఖలో ఒకరి నుంచి రూ. 18 లక్షలు, మరొకరి నుంచి రూ. 3 లక్షలను ఈ గ్యాంగ్ కాజేసింది. ఇంకా బయటపడని బాధితులు చాలా మందే ఉంటారని అనుమానం. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో విశాఖ పోలీసులు రంగంలోకి దిగారు. తీగ లాగితే కోల్ కతాలో డొంక కదిలింది. దీంతో కోల్ కతాకు వెళ్లిన విశాఖ పోలీసులు... అక్కడున్న 24 మంది టెలికాలర్లతో సహా 27 మందిని అరెస్ట్ చేశారు. 3 ల్యాప్ టాప్ లు, 40 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు వీరిని కోల్ కతా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. పీటీ వారెంట్ కు కోర్టు అనుమతిస్తే... వారందరినీ విశాఖకు తీసుకొచ్చి లోతుగా దర్యాప్తు చేయనున్నారు.   

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...