Skip to main content

చంద్రబాబు నిర్వాకం వల్లే ఇదంతా..



పవర్‌ ఫైనాన్స్‌ అప్పుపై ప్రతిపక్షం ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేయడం తగదని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. విద్యుత్‌ రంగంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...గత ప్రభుత్వం డిస్కంలకు పెద్ద మొత్తంలో బకాయిలు పెట్టిందని తెలిపారు. విద్యుత్‌ను ఎక్కువ రేటుకు తీసుకోవడం వల్ల రూ. 2700 కోట్ల మేర నష్టం వాటిల్లిందని వెల్లడించారు.  టీడీపీ ప్రభుత్వం రూ. 42 వేల కోట్ల అప్పులు మిగిల్చి వెళ్లిందని.. ఇప్పుడు తమపై అసత్యాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. ‘ హడావుడిగా పీపీఏలు కుదుర్చుకున్నారు. ధరలు తగ్గుతున్నాయని తెలిసినా ఎక్కువ రేట్లకు కొన్నారు. రూ. లక్షా 23వేల కోట్లుగా ఉన్న అప్పును 2.58 లక్షల కోట్లకు పెంచారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 9 నెలల జీతాలు పెండింగ్‌లో పెట్టారు. అయితే బడా కాంట్రాక్టర్లకు మాత్రం ఒక్క ఏప్రిల్‌ నెలలోనే రూ. 3358 కోట్లు చెల్లించారు. అదే నెలలో రూ. 5 వేల కోట్లు అప్పులు తెచ్చారు. సివిల్‌ సప్లైయ్స్‌ కార్పొరేషన్‌ను నిండా అప్పుల్లో ముంచారు. డబ్బులన్నీ పసుపు- కుంకుమకు వాడేశారు. నచ్చిన కాంట్రాక్టర్లకు రూ. 1060 కోట్లు చెల్లించారు. ఎన్నికలకు ముందు రూ. 38 వేల కోట్ల సప్లిమెంటరీ గ్రాంట్‌ తీసుకున్నారు’ అని గత ప్రభుత్వ తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబుకు తెలియదా..?
విద్యుత్ వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది బాబు ప్రభుత్వం కాదా అని బుగ్గన ప్రశ్నించారు. రూ. 7 వేల 200 కోట్ల నష్టాన్ని రూ. 14 వేల కోట్లకు పెంచారని మండిపడ్డారు. ‘ఎక్కువ ధరకు పవన విద్యుత్ కొనుగోలు చేశారు. దాని వలన ఇప్పటిక వరకు రూ. 2700 కోట్లు నష్టం వాటిల్లింది. థర్మల్ విద్యుత్ తక్కువకి వచ్చినా విండ్ పవర్ కోసం లాలూచీ పడి ఒప్పందాలు చేసుకున్నారు. మద్యం కంపెనీలకు రేట్లు ఎవరు పెంచారు..? విలువ ఆధారిత పన్ను, అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ గత ప్రభుత్వంలో వేసినవే.10 శాతం మార్జిన్, బాటిల్‌పై పెంచిన ధరల ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. కంపెనీలకు ఎలా వెళ్తుంది..? చంద్రబాబు తెలిసీ తెలియనట్టు మాట్లాడుతున్నారు. టీడీపీ వాళ్ళు మద్యపాన నిషేధం కోసం మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు’అని మంత్రి ఎద్దేవా చేశారు. తాము మద్యపాన నిషేధం దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 
చంద్రబాబు నిర్వాకం వల్లే ఇలా
‘అందరినీ ప్రశ్నిస్తానంటున్న చంద్రబాబు అక్రమ నివాసంలో ఎందుకు ఉంటున్నారో చెప్పాలి. యనమల కూడా మాట్లాడుతున్నారు. రూ. 2 లక్షల 58 వేల కోట్లకు ప్రజా అప్పులు పెంచింది మీరు కాదా..? రూ. 42 వేల కోట్ల బిల్లులు అప్పులు పెట్టి వెళ్లిపోయారు. మధ్యాహ్న భోజనం, విద్యుత్ బకాయిలు, ఆస్పత్రి వస్తువుల అప్పులు, ఔట్ సోర్సింగ్ జీతాలు పెండింగ్‌లో పెట్టారు. అప్పులను 3 నెలల్లో సరిదిద్దడం సాధ్యమా..?? బడా కాంట్రాక్టర్ల బిల్లులు మాత్రం చెల్లించేశారు. వీళ్ళు తలసరి ఆదాయం గురించి మాట్లాడతారా..? 25 శాతం నుంచి 22 శాతానికి పారిశ్రామిక రంగం తగ్గింది. అప్పు 20 శాతం నుండి 28 శాతానికి పెంచారు. బాబు, యనమల అధికారంలోకి వస్తే.. అప్పు, పేదరికం పెంచుతారనే విషయం తెలిసిందే. గతంలో ఇదే చేశారు. రూ. 38 వేల కోట్లు సప్లిమెంటరీ గ్రాంట్ తీసుకున్నారు. వెళ్లిపోతూ రూ. 65 వేల కోట్లు చెల్లింపులు బాధ్యత ఇచ్చి...అప్పు కూడా పుట్టకుండా చేశారు. చంద్రబాబు నిర్వాకాల వల్లనే విద్యుత్ కోతల సమస్య’ అని బుగ్గన చంద్రబాబు తీరును ఎండగట్టారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...