ఏపీలో విద్యుత్ కోతలు ఉన్న మాట నిజమేనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విద్యుత్ సమస్య పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు పక్క రాష్ట్రాలతో కూడా చర్చలు జరుపుతున్నామని తెలిపారు. విద్యుత్ కొరత గురించి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. గ్రామ సచివాలయాల ఆలోచన చంద్రబాబుకు వచ్చినప్పుడు... ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కొత్త ఇసుక పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత కొరత తగ్గిందని చెప్పారు. ఆసుపత్రుల వద్ద క్యాంటీన్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.
Comments
Post a Comment