Skip to main content

దసరాకు మొదలైన సెలవులు సంక్రాంతి వరకు కొనసాగుతాయేమో!: కేసీఆర్ సర్కారుపై విజయశాంతి సెటైర్



తెలంగాణలో ఆర్టీసీ సమ్మె, కార్మికుల పట్ల కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తున్న తీరు పట్ల కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. ఆర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని చెబుతున్న ప్రభుత్వం స్కూళ్లకు ఎందుకు సెలవులు పొడిగించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ సర్కారు తీరు చూస్తుంటే సమ్మె ముగిసేవరకు ఇలా సెలవులు పొడిగించుకుంటూ పోతారేమో అనిపిస్తోందని తెలిపారు. దసరాకు మొదలైన సెలవులు సంక్రాంతి వరకు కొనసాగించేట్టుందని ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పైనా విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీకాంతాచారి తరహాలో ఆత్మత్యాగానికి పాల్పడితే ప్రభుత్వం దిగొస్తుందని ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి బలవన్మరణానికి పాల్పడడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రజల ప్రాణత్యాగాలను తన స్వార్థం కోసం వాడుకోవడం కేసీఆర్ దొరగారికి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఇలాంటి ప్రాణత్యాగాలు చూసి చలించే మనస్తత్వం కేసీఆర్ ది కాదని పేర్కొన్నారు. ఏదైనా బతికి సాధించాలని, కేసీఆర్ దొరతనానికి అంతం చూడాలంటే అదే మార్గమని తెలిపారు.

Comments

Popular posts from this blog

Android ఫోన్లలో బ్యాంక్ అకౌంట్ వివరాలు దోచుకునే కొత్త మాల్వేర్ 'BlackRock' హడలెత్తిస్తోంది

Trojan కేటగిరికి చెందినదిగా చెబుతున్న 'BlackRock' అనే ఒక మాల్వేర్ Android స్మార్ట్ ఫోన్ల నుండి వినియోగదారుల విలువైన బ్యాంక్ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు బయటపడింది. ఇప్పటి వరకూ పర్సనల్ డేటా చౌర్యానికి మాత్రమే పరిమితమైన సైబర్ దాడులు ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల నుండి బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా దోచుకునేంతగా ముందుకు సాగుతోంది. ఒక మాల్వేర్, బ్యాంక్ అకౌంట్ ఆధారాలను మరియు క్రెడిట్ కార్డు వాటి వాటి వివరాలను ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల ద్వారా సేకరిస్తున్నట్లు మరియు ఇది దాదాపుగా 300 పైగా ఆండ్రాయిడ్ యాప్స్ పైన తాన్ ప్రభావాన్ని చూపిస్తున్నట్లు తెలిపింది. అసలే ప్రజలు కరోనా మహమ్మారితో దెబ్బకి హడలెత్తి పోతోంటే, ఆన్ లైన్ లో సైబర్ దాడులు మరియు సైబర్ మోసాలు మరింతగా కృంగదీస్తున్నాయి. ఇప్పటి వరకూ పర్సనల్ డేటా చౌర్యానికి మాత్రమే పరిమితమైన సైబర్ దాడులు ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల నుండి బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా దోచుకునేంతగా ముందుకు  సాగుతోంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక నివేదిక ప్రకారం,Trojan కేటగిరికి చెందినదిగా చెబుతున్న 'BlackRock' అనే ఒక మాల్వేర్ Android స...

ఆమిర్‌ ఖాన్‌పై విమర్శలు గుప్పిస్తున్న నెటిజెన్లు

  బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ పై నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, తన తాజా చిత్రం 'లాల్ సింగ్ చద్దా' షూటింగ్ కోసం ఆమిర్ ఇటీవల టర్కీకి వెళ్లారు. ఈ సమయంలో ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు అక్కడి వారు ఉత్సాహం చూపారు. తన పర్యటనలో భాగంగా టర్కీ అధ్యక్షుడి భార్య ఎమినే ఎర్డోగన్ ను కూడా ఆమిర్ కలిశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె తెలిపారు. ప్రముఖ భారతీయ నటుడు ఆమిర్ ను కలవడం సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. టర్కీలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ చేశారని.. ఆ చిత్రాన్ని చూసేందుకు తాను కూడా ఎదురుచూస్తున్నానని ఆమె అన్నారు. ఈ వ్యవహారంపై ఆమిర్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ కు టర్కీ అధ్యక్షుడు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎమినేను ఆమిర్ కలవకుండా వుండి ఉంటే బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.