Skip to main content

ఎన్నో ట్రావెల్స్ బస్సులున్నా.. జగన్ కు మా బస్సులే కనిపిస్తున్నాయి: జేసీ దివాకర్ రెడ్డి

 

జగన్ పాలనకు 100 మార్కులకు గాను 150 మార్కులు వేయాలని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సెటైర్ వేశారు. జగన్ పాలన చాలా జనరంజకంగా సాగుతోందని అన్నారు. అయితే, పాలనలో మాత్రం కింద, మీద పడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నో ట్రావెల్స్ బస్సులున్నప్పటికీ... జగన్ కు తమ బస్సులే కనిపిస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 31 బస్సులు సీజ్ చేశారని చెప్పారు. 70 ఏళ్ల నుంచి ట్రావెల్స్ రంగంలో ఉన్నామని... చిన్నచిన్న పొరపాట్లు ఆర్టీసీ సహా ఏ ట్రావెల్స్ కైనా సహజమేనని చెప్పారు. తమ బస్సులను మాత్రమే బూతద్దంలో చూస్తూ సీజ్ చేస్తున్నారని... ఫైన్ లతో పోయేదానికి సీజ్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఈ విషయంపై కోర్టుకు వెళతామని చెప్పారు. జగన్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ తమ అబ్బాయేనని అన్నారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.