Skip to main content

తీహార్ జైలు నుంచి విడుదలైన దుష్యంత్ చౌతాలా తండ్రి

 
 


హర్యానాలో సంచలన విజయం సాధించి, కింగ్ మేకర్ గా అవతరించిన జననాయక జనతా పార్టీ అధినేత దుష్యంత్ చౌతాలా తండ్రి అజయ్ చౌతాలా తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు ఢిల్లీ హైకోర్టు రెండు వారాల పెరోల్ ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కేసులో వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో, ఆయన జైలు శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో దుష్యంత్ నేతృత్వంలోని జేజేపీ 10 సీట్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆయన మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న బీజేపీ, ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మరో రెండు మంత్రి పదవులను దుష్యంత్ కు ఆఫర్ చేసింది. ఫలితాలు వెల్లడైన వెంటనే జైలులో ఉన్న తండ్రిని దుష్యంత్ కలుసుకున్నారు. ఆయన సూచన మేరకే బీజేపీతో చేతులు కలిపారు. నేడు జరగనున్న ప్రమాణస్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ తో పాటు దుష్యంత్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.