Skip to main content

కోర్టు ఎదుట లొంగిపోయిన... కోడెల కుమారుడు శివరామ్

కోర్టు ఎదుట లొంగిపోయిన... కోడెల కుమారుడు శివరామ్– News18 Telugu

ఆరు కేసుల విషయంలో హైకోర్టు నుంచి కోడెల శివరామ్ బెయిల్ తెచ్చుకున్నారు. దీంతో హైకోర్టు ఆయనను కింది కోర్టులో లొంగిపోవాలని సూచించింది.మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు కుమారుడు కోడెల శివరాం కోర్టు ఎదుట లొంగిపోయారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక అక్రమాలకు పాల్పడ్డారని శివరాంపై అనేక కేసులు నమోదయ్యాయి. కేట్యాక్స్ పేరుతో ఆయన వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. అతనితో పాటు ఆయన సోదరిపై కూడా పలువురు బాధితులు 19 కేసులు పెట్టారు. అయితే ఆరు కేసుల విషయంలో హైకోర్టు నుంచి కోడెల శివరామ్ బెయిల్ తెచ్చుకున్నారు. దీంతో హైకోర్టు ఆయనను కింది కోర్టులో లొంగిపోవాలని సూచించింది. దీంతో శివరామ్ ఇవాళ గుంటూరు జిల్లా నరసరావు పేట ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట లొంగిపొయారు. అనంతరం ముందస్తు బెయిల్‌ కోసం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.అయితే శివరామ్‌కు కోర్టు బెయిల్ ఇస్తుందా లేదా అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...