Skip to main content

కోర్టు ఎదుట లొంగిపోయిన... కోడెల కుమారుడు శివరామ్

కోర్టు ఎదుట లొంగిపోయిన... కోడెల కుమారుడు శివరామ్– News18 Telugu

ఆరు కేసుల విషయంలో హైకోర్టు నుంచి కోడెల శివరామ్ బెయిల్ తెచ్చుకున్నారు. దీంతో హైకోర్టు ఆయనను కింది కోర్టులో లొంగిపోవాలని సూచించింది.మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు కుమారుడు కోడెల శివరాం కోర్టు ఎదుట లొంగిపోయారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక అక్రమాలకు పాల్పడ్డారని శివరాంపై అనేక కేసులు నమోదయ్యాయి. కేట్యాక్స్ పేరుతో ఆయన వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. అతనితో పాటు ఆయన సోదరిపై కూడా పలువురు బాధితులు 19 కేసులు పెట్టారు. అయితే ఆరు కేసుల విషయంలో హైకోర్టు నుంచి కోడెల శివరామ్ బెయిల్ తెచ్చుకున్నారు. దీంతో హైకోర్టు ఆయనను కింది కోర్టులో లొంగిపోవాలని సూచించింది. దీంతో శివరామ్ ఇవాళ గుంటూరు జిల్లా నరసరావు పేట ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట లొంగిపొయారు. అనంతరం ముందస్తు బెయిల్‌ కోసం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.అయితే శివరామ్‌కు కోర్టు బెయిల్ ఇస్తుందా లేదా అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.