Skip to main content

కోడెల ఆత్మహత్య కేసు విచారణ... కీలక విషయాలు చెప్పిన శివరామ్

కోడెల ఆత్మహత్య కేసు విచారణ... కీలక విషయాలు చెప్పిన శివరామ్



ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసు దర్యాప్తును తెలంగాణ పోలీసులు వేగవంతం చేశారు. ఆదివారం గుంటూరు చేరుకున్న పోలీసులు కోడెల శివరాంని పిలిపించి కోడెల మృతికి గల కారణాలపై ఆరా తీసినట్లు సమాచారం. ఆత్మహత్య చేసుకున్నారా? ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు? అలాంటి విషయాలపై శివరామ్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కోడెల ఆత్మహత్యను అనుమానాస్పద మృతిగా హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఇప్పటికే ఇంట్లో పనివాళ్లు, గన్‌మెన్‌లను విచారించి పోలీసులు స్టేట్‌మెంట్‌ నమోదు చేశారు. కోడెల కుమారుడు, కుమార్తెకు కూడా గతంలోనే తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే తండ్రి అపరకర్మలు నిర్వర్తించాల్సి ఉన్నందున ఇప్పుడే తాను రాలేనని, కొంత సమయం కావాలని కోడెల కుమారుడు శివరాం పోలీసులను కోరారు.ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులే గుంటూరుకు వచ్చి కోడెల శివరాంని విచారణకు పిలిపించారు.

విచారణకు హాజరైన శివరాం తన తండ్రి శివప్రసాదరావు కేసుల ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పినట్లు సమాచారం. తండ్రితో ఎలాంటి విభేదాలు లేవని, అంతా కలిసే ఉంటామని పోలీసులకు శివరాం చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకునే రోజుకు ముందే తాను విదేశాలకు వెళ్లానని, కుటుంబ సభ్యులు చెప్తేనే తనకు తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందని శివరాం చెప్పినట్లు సమాచారం. కోడెల శివప్రసాదరావు భార్య నుంచి కూడా హైదరాబాద్ పోలీసులు స్టేట్‌మెంట్‌ రికార్డు చేసుకున్నారు. ఒత్తిడి కారణంగానే తన భర్త చనిపోయారని కోడెల భార్య చెప్పినట్లుగా తెలుస్తోంది. కేసులకు ఎన్నడూ కోడెల భయపడలేదని, ఒత్తిళ్ల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పినట్లు సమాచారం. ఆత్మహత్య చేసుకునేలా ఆయన ఎప్పుడూ ప్రవర్తించలేదని ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.