Skip to main content

విధానాలు వ్యతిరేకించకూడదు : నిర్మలాసీతారామన్‌

 



వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) విధానంలో లోపాలున్న మాట వాస్తవమేనని, అంతమాత్రాన విధానమే తప్పని విమర్శించడం, దూషించడం సరికాదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఆర్థిక నిపుణులు తగిన సలహాలు ఇస్తే లోపాలు సరిద్దేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పరిశ్రమ వర్గాలు, పలువురు ఆర్థిక రంగ నిపుణులతో పుణెలో శుక్రవారం ఆమె సమావేశం నిర్వహించారు. జీఎస్‌టీ వసూళ్లలో క్షీణత ఉందని, కొన్ని ప్రాంతాల్లో ప్రకృతి విపత్తుల కారణంగా వసూళ్లు తగ్గాయని వివరించారు. ఇందుకు గల కారణాలను అన్వేషించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా కొంతమంది జీఎస్టీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై స్పందించిన నిర్మల పార్లమెంటుతో సహా అన్ని రాష్ట్రాల శాసన సభల్లో ఆమోదం పొందిన జీఎస్‌టీ విధానాన్ని తప్పుపట్టడం సరికాదన్నారు. ఇబ్బందులు ఉన్నంత మాత్రాన వ్యతిరేకించకుండా మెరుగైన విధాన రూపక్పనకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కొందరు ఆర్థిక నిపుణులు ఇచ్చిన సలహాలను స్వీకరించారు

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.