Skip to main content

బోరు బావిలో చిన్నారి చిక్కుకుపోవడం పట్ల ప్రధాని ఆవేదన

 

ఇటీవల కాలంలో బోరు గుంతలు పిల్లల ప్రాణాలు బలిగొంటున్న సంఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా తమిళనాడులో సుజిత్ విల్సన్ అనే రెండేళ్ల బాలుడు బోరు బావిలో పడిపోవడం దేశవ్యాప్తంగా ఆవేదన కలిగిస్తోంది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆ చిన్నారి ఎలాంటి ఆపద వాటిల్లకుండా క్షేమంగా బయటపడాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. చిన్నారిని బయటికి తీసుకువచ్చేందుకు అన్నిరకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ అంశంపై తమిళనాడు సీఎం పళనిస్వామితో కూడా చర్చించానని మోదీ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో మూడు రోజుల క్రితం ఆ చిన్నారి బోరు బావిలో పడిపోయాడు. అప్పటినుంచి సుజిత్ ను సురక్షితంగా బయటికి తీసుకువచ్చేందుకు సహాయ చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...