Skip to main content

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాంకేతికంగా వీలు కాదు: కన్నా స్పష్టీకరణ

 

బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ప్రత్యేక హోదా అంశంపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాంకేతికంగా వీలుకాదని స్పష్టం చేశారు. హోదా అంశాన్ని రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని ఆరోపించారు. రాజకీయాలు ఎన్నికలప్పుడు మాత్రమే చేయాలని, ఇప్పడు రాష్ట్రాభివృద్ధికి అన్ని పార్టీలు కలసి రావాలని కన్నా పిలుపునిచ్చారు. 

రాష్ట్రంలో సమస్యలపై స్పందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్లే ఇసుక సమస్య ఉత్పన్నమైందని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్మాణ రంగంపై ఆధారపడ్డ కుటుంబాలకు రూ.10 వేలు చొప్పున ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం పనుల ఆలస్యం, రీటెండరింగ్ పై కేంద్రం నివేదిక కోరిందని, నివేదిక తర్వాత రాష్ట్రంపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అన్నారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...