Skip to main content

మహిళా టూరిస్టు కోసం కాన్వాయ్ ఆపేసిన సీఎం.


గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ఓ ప్రమాదంలో గాయపడిన మహిళకు సాయం చేసేందుకు తన కాన్వాయ్‌ని నిలిపివేసి మరీ ముందుకొచ్చారు. వృత్తిరీత్యా వైద్యుడైన ఆయన తొలుత ఆమె ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి, అనంతరం తన కాన్వాయ్‌లో సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్థానికులను విశేషంగా ఆకట్టుకున్న ఈ ఘటనపై వివరాల్లోకి వెళ్తే..
నిన్న ఓ అధికారిక పర్యటన కోసం ఢిల్లీ వెళ్లి వచ్చిన సావంత్... దాబోలిమ్ విమానాశ్రయం నుంచి తిరిగి వస్తూ జురాయ్ బ్రిడ్జివద్ద కాన్వాయ్ నిలిపివేశారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ మహిళా టూరిస్టు రోడ్డుపై పడిపోయినట్టు గుర్తించి హుటాహుటిన సాయం అందించేందుకు ముందుకొచ్చారు. వృత్తిరీత్యా ఆయన డాక్టర్ కావడంతో ఆమెకు స్వయంగా వైద్య పరీక్షలు చేశారు. ఆమె గాయాలకు ప్రధమ చికిత్స చేసి తన కాన్వాయ్‌లోని ఓ కారులో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి చేర్పించారు. ఘటనా స్థలంలో కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుత ఇది వైరల్‌గా మారింది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...