Skip to main content

మహిళా టూరిస్టు కోసం కాన్వాయ్ ఆపేసిన సీఎం.


గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ఓ ప్రమాదంలో గాయపడిన మహిళకు సాయం చేసేందుకు తన కాన్వాయ్‌ని నిలిపివేసి మరీ ముందుకొచ్చారు. వృత్తిరీత్యా వైద్యుడైన ఆయన తొలుత ఆమె ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి, అనంతరం తన కాన్వాయ్‌లో సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్థానికులను విశేషంగా ఆకట్టుకున్న ఈ ఘటనపై వివరాల్లోకి వెళ్తే..
నిన్న ఓ అధికారిక పర్యటన కోసం ఢిల్లీ వెళ్లి వచ్చిన సావంత్... దాబోలిమ్ విమానాశ్రయం నుంచి తిరిగి వస్తూ జురాయ్ బ్రిడ్జివద్ద కాన్వాయ్ నిలిపివేశారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ మహిళా టూరిస్టు రోడ్డుపై పడిపోయినట్టు గుర్తించి హుటాహుటిన సాయం అందించేందుకు ముందుకొచ్చారు. వృత్తిరీత్యా ఆయన డాక్టర్ కావడంతో ఆమెకు స్వయంగా వైద్య పరీక్షలు చేశారు. ఆమె గాయాలకు ప్రధమ చికిత్స చేసి తన కాన్వాయ్‌లోని ఓ కారులో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి చేర్పించారు. ఘటనా స్థలంలో కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుత ఇది వైరల్‌గా మారింది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.