Skip to main content

మహిళా టూరిస్టు కోసం కాన్వాయ్ ఆపేసిన సీఎం.


గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ఓ ప్రమాదంలో గాయపడిన మహిళకు సాయం చేసేందుకు తన కాన్వాయ్‌ని నిలిపివేసి మరీ ముందుకొచ్చారు. వృత్తిరీత్యా వైద్యుడైన ఆయన తొలుత ఆమె ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి, అనంతరం తన కాన్వాయ్‌లో సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్థానికులను విశేషంగా ఆకట్టుకున్న ఈ ఘటనపై వివరాల్లోకి వెళ్తే..
నిన్న ఓ అధికారిక పర్యటన కోసం ఢిల్లీ వెళ్లి వచ్చిన సావంత్... దాబోలిమ్ విమానాశ్రయం నుంచి తిరిగి వస్తూ జురాయ్ బ్రిడ్జివద్ద కాన్వాయ్ నిలిపివేశారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ మహిళా టూరిస్టు రోడ్డుపై పడిపోయినట్టు గుర్తించి హుటాహుటిన సాయం అందించేందుకు ముందుకొచ్చారు. వృత్తిరీత్యా ఆయన డాక్టర్ కావడంతో ఆమెకు స్వయంగా వైద్య పరీక్షలు చేశారు. ఆమె గాయాలకు ప్రధమ చికిత్స చేసి తన కాన్వాయ్‌లోని ఓ కారులో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి చేర్పించారు. ఘటనా స్థలంలో కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుత ఇది వైరల్‌గా మారింది.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...