
టీడీపీ నేత వర్ల రామయ్య ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. వాస్తవానికి ఎన్నికల్లో టీడీపీ పరాజయంపాలైన వెంటనే ఆయన ఆర్టీసీ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటారని భావించారు. కానీ ఆయన పదవికి రాజీనామా చేయకపోవడంతో ప్రభుత్వం నోటీసులు పంపింది. ఈ నేపథ్యంలో వర్ల రామయ్య తన రాజీనామా లేఖను ఏపీ రవాణా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శికి పంపారు. వర్ల రామయ్య పదవీకాలం 2019 ఏప్రిల్ 24తో ముగిసింది. దాంతో సెప్టెంబరులో ఆయనకు నోటీసులు పంపారు.
Comments
Post a Comment