Skip to main content

జగన్ కు భారీ షాక్ త్వరలో కీలక నేత పార్టీకి గుడ్ బై....


credit: third party image reference
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసిపీకి త్వరలో ఓ కీలక నేత పార్టీకి గుడ్ బై కోట్టనున్నారు. ఆ కీలక నేత ఎవరో కాదు ఎన్టీఆర్ అల్లుడు మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన భార్యతో కలిసి ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిశారు.
త్వరలో ఆయన వైసిపీకి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సంబంధించిన చర్చలు జరిపారు. ఓ మంచి ముహూర్తం చూసి బీజేపీ కండువా కప్పుకోనున్నారు. వైసిపీ ప్రభుత్వం మీద పురంధేశ్వరి విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో దగ్గుబాటి నుంచి ఏలాంటి రియాక్షన్ లేవు.
credit: third party image reference
పురంధేశ్వరిని కూడా వైసిపీ లోకి తీసుకు రావాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు వైసిపీ పెద్దలు సూచించినట్లు తెలిసింది. అయితే భార్య భర్తలు ఇద్దరూ జగన్ వద్ద చేరడం కంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరడం మంచిదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో పని చేయడం దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు కొత్తమి కాదు. గతంలో బిజెపితో కలిసి పని చేశారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.