Skip to main content

చంద్రబాబు తీరు.. దొంగే దొంగ అన్నట్లుంది!


వైసిపీలో వైసీపీ, టీడీపీ మధ్య సోషల్‌ వార్‌ నడుస్తోంది. అసభ్యకర పోస్టుల వ్యవహారంపై ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్‌ చేశారు. విూడియాలో అసత్య ప్రచారానికి ఆధ్యుడు బాబేనని, ఆయన ఆరోపణలు చేయడం దొంగే దొంగ అరుస్తున్నట్లు ఉందంటూ ఎద్దేవా చేశారు. అనుకూల విూడియాను అడ్డుపెట్టుకుని ఇష్టమొచ్చినట్లు బురదజల్లడం చంద్రబాబుకు నలభై ఏళ్లుగా అలవాటేనని విజయసాయి విమర్శించారు. వైసీపీ మహిళా నేతలను అత్యంత నీచమైన భాషతో తిట్టించారని ఆరోపించారు. ఇప్పుడు ఆయనదాకా వచ్చే సరికి తనే బాధితుడినన్నట్టు అనుకూల విూడియాలో శోకాలు పెడుతున్నాడన్నారు. తన వరకు వస్తే కానీ ఆ బాధేమిటే తెలియలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు నుంచే పచ్చవిూడియాలో అభూత కల్పనలు రాస్తూ ప్రజలను మోసం చేశారని విజయసాయి ఆరోపించారు. 1982 నుంచి ‘లేనిది ఉన్నట్టు’ రాస్తూ ప్రజలను మభ్య పెట్టిన పచ్చ విూడియా అడ్రసు గల్లంతవుతుందనే భయం చంద్రబాబుకు పట్టుకుందన్నారు. అందుకే సోషల్‌ విూడియా పోస్టింగులపై విూడియా కాన్ఫరెన్స్‌ పెట్టి తన స్థాయిని దిగజార్చుకున్నాడని విమర్శలు గుప్పించారు. తన పాలనలో 600 కేసులు పెట్టి వేధించిన సంగతి ఎవరూ మర్చి పోరంటూ వ్యాఖ్యానించారు. సోషల్‌ విూడియాలో పోస్టుల వ్యవహారంపై చంద్రబాబు ప్రెజెంటేషన్‌పై విజయసాయి సెటైర్లు పేల్చారు. మొన్నటి వరకు అమరావతి ప్రపంచ స్థాయి సిటీ, రెండో టోక్యో అవుతుందని ప్రజెంటేషన్లతో చావగొట్టాడంటూ హేళన చేశారు. ఇప్పడేమో సోషల్‌ విూడియాలో దుర్భాషలాడుతున్నారని ఎవరూ పట్టించుకోని పోస్టులను అందరికీ చూపించి పాతాళంలోకి జారిపోయాడని విమర్శలు చేశారు. ఎన్ని జాకీలు పెట్టినా పచ్చ విూడియా చంద్రబాబును బయటకు లాగలేదని విజయసాయి ఎద్దేవా చేశారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...