Skip to main content

చంద్రబాబు తీరు.. దొంగే దొంగ అన్నట్లుంది!


వైసిపీలో వైసీపీ, టీడీపీ మధ్య సోషల్‌ వార్‌ నడుస్తోంది. అసభ్యకర పోస్టుల వ్యవహారంపై ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్‌ చేశారు. విూడియాలో అసత్య ప్రచారానికి ఆధ్యుడు బాబేనని, ఆయన ఆరోపణలు చేయడం దొంగే దొంగ అరుస్తున్నట్లు ఉందంటూ ఎద్దేవా చేశారు. అనుకూల విూడియాను అడ్డుపెట్టుకుని ఇష్టమొచ్చినట్లు బురదజల్లడం చంద్రబాబుకు నలభై ఏళ్లుగా అలవాటేనని విజయసాయి విమర్శించారు. వైసీపీ మహిళా నేతలను అత్యంత నీచమైన భాషతో తిట్టించారని ఆరోపించారు. ఇప్పుడు ఆయనదాకా వచ్చే సరికి తనే బాధితుడినన్నట్టు అనుకూల విూడియాలో శోకాలు పెడుతున్నాడన్నారు. తన వరకు వస్తే కానీ ఆ బాధేమిటే తెలియలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు నుంచే పచ్చవిూడియాలో అభూత కల్పనలు రాస్తూ ప్రజలను మోసం చేశారని విజయసాయి ఆరోపించారు. 1982 నుంచి ‘లేనిది ఉన్నట్టు’ రాస్తూ ప్రజలను మభ్య పెట్టిన పచ్చ విూడియా అడ్రసు గల్లంతవుతుందనే భయం చంద్రబాబుకు పట్టుకుందన్నారు. అందుకే సోషల్‌ విూడియా పోస్టింగులపై విూడియా కాన్ఫరెన్స్‌ పెట్టి తన స్థాయిని దిగజార్చుకున్నాడని విమర్శలు గుప్పించారు. తన పాలనలో 600 కేసులు పెట్టి వేధించిన సంగతి ఎవరూ మర్చి పోరంటూ వ్యాఖ్యానించారు. సోషల్‌ విూడియాలో పోస్టుల వ్యవహారంపై చంద్రబాబు ప్రెజెంటేషన్‌పై విజయసాయి సెటైర్లు పేల్చారు. మొన్నటి వరకు అమరావతి ప్రపంచ స్థాయి సిటీ, రెండో టోక్యో అవుతుందని ప్రజెంటేషన్లతో చావగొట్టాడంటూ హేళన చేశారు. ఇప్పడేమో సోషల్‌ విూడియాలో దుర్భాషలాడుతున్నారని ఎవరూ పట్టించుకోని పోస్టులను అందరికీ చూపించి పాతాళంలోకి జారిపోయాడని విమర్శలు చేశారు. ఎన్ని జాకీలు పెట్టినా పచ్చ విూడియా చంద్రబాబును బయటకు లాగలేదని విజయసాయి ఎద్దేవా చేశారు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...