Skip to main content

చంద్రబాబు తీరు.. దొంగే దొంగ అన్నట్లుంది!


వైసిపీలో వైసీపీ, టీడీపీ మధ్య సోషల్‌ వార్‌ నడుస్తోంది. అసభ్యకర పోస్టుల వ్యవహారంపై ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్‌ చేశారు. విూడియాలో అసత్య ప్రచారానికి ఆధ్యుడు బాబేనని, ఆయన ఆరోపణలు చేయడం దొంగే దొంగ అరుస్తున్నట్లు ఉందంటూ ఎద్దేవా చేశారు. అనుకూల విూడియాను అడ్డుపెట్టుకుని ఇష్టమొచ్చినట్లు బురదజల్లడం చంద్రబాబుకు నలభై ఏళ్లుగా అలవాటేనని విజయసాయి విమర్శించారు. వైసీపీ మహిళా నేతలను అత్యంత నీచమైన భాషతో తిట్టించారని ఆరోపించారు. ఇప్పుడు ఆయనదాకా వచ్చే సరికి తనే బాధితుడినన్నట్టు అనుకూల విూడియాలో శోకాలు పెడుతున్నాడన్నారు. తన వరకు వస్తే కానీ ఆ బాధేమిటే తెలియలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు నుంచే పచ్చవిూడియాలో అభూత కల్పనలు రాస్తూ ప్రజలను మోసం చేశారని విజయసాయి ఆరోపించారు. 1982 నుంచి ‘లేనిది ఉన్నట్టు’ రాస్తూ ప్రజలను మభ్య పెట్టిన పచ్చ విూడియా అడ్రసు గల్లంతవుతుందనే భయం చంద్రబాబుకు పట్టుకుందన్నారు. అందుకే సోషల్‌ విూడియా పోస్టింగులపై విూడియా కాన్ఫరెన్స్‌ పెట్టి తన స్థాయిని దిగజార్చుకున్నాడని విమర్శలు గుప్పించారు. తన పాలనలో 600 కేసులు పెట్టి వేధించిన సంగతి ఎవరూ మర్చి పోరంటూ వ్యాఖ్యానించారు. సోషల్‌ విూడియాలో పోస్టుల వ్యవహారంపై చంద్రబాబు ప్రెజెంటేషన్‌పై విజయసాయి సెటైర్లు పేల్చారు. మొన్నటి వరకు అమరావతి ప్రపంచ స్థాయి సిటీ, రెండో టోక్యో అవుతుందని ప్రజెంటేషన్లతో చావగొట్టాడంటూ హేళన చేశారు. ఇప్పడేమో సోషల్‌ విూడియాలో దుర్భాషలాడుతున్నారని ఎవరూ పట్టించుకోని పోస్టులను అందరికీ చూపించి పాతాళంలోకి జారిపోయాడని విమర్శలు చేశారు. ఎన్ని జాకీలు పెట్టినా పచ్చ విూడియా చంద్రబాబును బయటకు లాగలేదని విజయసాయి ఎద్దేవా చేశారు.

Comments

Popular posts from this blog

ఆర్టీసీ విలీనం చేసి తీరుతాం: ఏపీ సర్కారుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని స్పందన

ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ విలీనంపై ఓ ప్రయోగం చేశారని, ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని స్పందించారు. విజయవాడ ఆర్టీసీ ఆసుపత్రిలో టీడీపీ ఎంపీ కేశినేని నాని నిర్మించిన వసతి భవనాన్ని పేర్ని నాని ప్రారంభించి మాట్లాడుతూ తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై స్పందించారు. తెలంగాణ ఆర్టీసీలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నామని, దేశంలో చాలా వ్యవస్థలు ప్రైవేటు పరం అవుతున్న పరిస్థితుల్లో ఏపీలో మాత్రం ఒక కార్పొరేషన్ ను సర్కారులో విలీనం చేయడమనేది గొప్ప విషయమని పేర్ని నాని అన్నారు. తెలంగాణలో జరుగుతోన్న ఆర్టీసీ సమ్మెపై ఇటీవల కేసీఆర్ మాట్లాడుతూ ఏపీలో ఏం జరుగుతుందో ఆరు నెలల్లో చూద్దామని అన్నారని, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో తమ ప్రభుత్వంలో కసి పెరిగిందని తెలిపారు. జగన్ తీసుకున్న నిర్ణయం మేరకు ఆర్టీసీ కార్మికులను విలీనం చేస్తామని ప్రకటన చేశామని, దాన్ని అమలు చేసి తీరాలన్న పట్టుదల పెరిగిందని పేర్ని నాని అన్నారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యను తాము పాజిటివ్ గా తీసుకున్నామని చెప్పారు. కొన్ని నెలల్ల...

ఆ జీవో రద్దు చేయడం దారుణం: అయ్యన్నపాత్రుడు

రైతు రుణమాఫీకి ఇచ్చిన జీవోను రద్దు చేయడం దారుణమని, ఏ ప్రభుత్వం ఉన్న నడుస్తున్న పథకాలను కొనసాగించాలని టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. జగన్ ప్రభుత్వం నిన్న రద్దు చేసిన జీవో 38పై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మీద కోపంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబుకు అసలు వ్యవసాయం పట్ల అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. తమ హయాంలో మొత్తం 14,124 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. వంద రోజుల తర్వాత కూడా చంద్రబాబు పాలన గురించి మాట్లాడుతున్నారని.. అసలు వైసీపీ పాలన ఏంటో చెప్పాలని అయ్యన్న డిమాండ్ చేశారు.  ప్రభుత్వం లోపాలను ఎత్తి చూపిస్తే ప్రతిపక్షం విమర్శలు చేస్తోందని అంటూ.. వైసీపీ నేతలు తిరిగి విమర్శలు చేస్తున్నారని అయ్యన్న మండిపడ్దారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే నాలుకలు, పీకలు కోస్తామని బెదిరిస్తున్నారని, వారి బెదిరింపులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలకు కోపం వస్తే గొంతు పిసికి చంపేస్తారన్నారు. వైసీపీ నేతలు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని అయ్యన్న హెచ్చరించారు. అవంతి శ్రీనివాస్ మంచి వ్యక్తి, ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్...