Skip to main content

కనపడని శత్రువుతో యుద్ధం చేయడం కష్టం.. చంద్రబాబు లేఖపై వల్లభనేని వంశీ స్పందన!

 

తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని వల్లభనేని వంశీ, చంద్రబాబుకు లేఖ రాయగా, చంద్రబాబు స్పందించిన సంగతి తెలిసిందే. వంశీకి ఆయన ప్రత్యుత్తరం ఇవ్వగా, దానిపై వంశీ స్పందించారు. తన లేఖపై స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు అడుగు జాడల్లో తాను నడిచి, ప్రభుత్వ హింసను ఎదుర్కొన్నానని అన్నారు. జిల్లాలో పార్టీ మద్దతు తనకు లభించకపోయినా, రాజ్యాంగ బద్ధమైన సంస్థల సాయంతో అన్యాయాలపై పోరాడానని అన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని తనపై ఒత్తిడి తెచ్చిన సంగతి మీకు తెలుసునని, అయితే, కనపడని శత్రువుతో యుద్ధం చేయడం కష్టమని వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నికల్లో పోటీ చేసిన పలు సందర్భాలను ఉటంకిస్తూ, గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉన్నప్పటికీ, అధ్యక్షుడి ఆదేశం మేరకు విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశానని అన్నారు. నగర టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన వేళ, కాంగ్రెస్ అరాచకాలపై పోరాడానని అన్నారు.

ఎన్నికల తరువాత తనను ఎన్నో సమస్యలు చుట్టుముట్టాయని ఈ లేఖలో పేర్కొన్న వంశీ, రాజకీయంగా వేధిస్తున్నారని, అనుచరులపై కేసులు పెడుతున్నారని వాపోయారు. తన వారిని ఇబ్బందుల పాలు చేయడం ఇష్టం లేకనే రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.  

Comments

Popular posts from this blog

Android ఫోన్లలో బ్యాంక్ అకౌంట్ వివరాలు దోచుకునే కొత్త మాల్వేర్ 'BlackRock' హడలెత్తిస్తోంది

Trojan కేటగిరికి చెందినదిగా చెబుతున్న 'BlackRock' అనే ఒక మాల్వేర్ Android స్మార్ట్ ఫోన్ల నుండి వినియోగదారుల విలువైన బ్యాంక్ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు బయటపడింది. ఇప్పటి వరకూ పర్సనల్ డేటా చౌర్యానికి మాత్రమే పరిమితమైన సైబర్ దాడులు ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల నుండి బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా దోచుకునేంతగా ముందుకు సాగుతోంది. ఒక మాల్వేర్, బ్యాంక్ అకౌంట్ ఆధారాలను మరియు క్రెడిట్ కార్డు వాటి వాటి వివరాలను ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల ద్వారా సేకరిస్తున్నట్లు మరియు ఇది దాదాపుగా 300 పైగా ఆండ్రాయిడ్ యాప్స్ పైన తాన్ ప్రభావాన్ని చూపిస్తున్నట్లు తెలిపింది. అసలే ప్రజలు కరోనా మహమ్మారితో దెబ్బకి హడలెత్తి పోతోంటే, ఆన్ లైన్ లో సైబర్ దాడులు మరియు సైబర్ మోసాలు మరింతగా కృంగదీస్తున్నాయి. ఇప్పటి వరకూ పర్సనల్ డేటా చౌర్యానికి మాత్రమే పరిమితమైన సైబర్ దాడులు ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల నుండి బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా దోచుకునేంతగా ముందుకు  సాగుతోంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక నివేదిక ప్రకారం,Trojan కేటగిరికి చెందినదిగా చెబుతున్న 'BlackRock' అనే ఒక మాల్వేర్ Android స...

ఆమిర్‌ ఖాన్‌పై విమర్శలు గుప్పిస్తున్న నెటిజెన్లు

  బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ పై నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, తన తాజా చిత్రం 'లాల్ సింగ్ చద్దా' షూటింగ్ కోసం ఆమిర్ ఇటీవల టర్కీకి వెళ్లారు. ఈ సమయంలో ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు అక్కడి వారు ఉత్సాహం చూపారు. తన పర్యటనలో భాగంగా టర్కీ అధ్యక్షుడి భార్య ఎమినే ఎర్డోగన్ ను కూడా ఆమిర్ కలిశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె తెలిపారు. ప్రముఖ భారతీయ నటుడు ఆమిర్ ను కలవడం సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. టర్కీలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ చేశారని.. ఆ చిత్రాన్ని చూసేందుకు తాను కూడా ఎదురుచూస్తున్నానని ఆమె అన్నారు. ఈ వ్యవహారంపై ఆమిర్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ కు టర్కీ అధ్యక్షుడు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎమినేను ఆమిర్ కలవకుండా వుండి ఉంటే బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.