Skip to main content

ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ నుంచి మేరీకోమ్ ఔట్!



ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత బాక్సర్ మేరీకోమ్.. కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. ఈ రోజు జరిగిన సెమీఫైనల్ లో టర్కీ బాక్సర్ బ్యూస్ నాజ్  కేరిరోగ్లు చేతిలో (51 కిలోల విభాగంలో) 1-4 తేడాతో ఓడిపోయి, బాక్సింగ్ ఛాంపియన్ షిప్ నుంచి వెనుదిరిగింది. రష్యాలోని ఉలాన్ ఉదెలో ఈ పోటీలు కొనసాగుతున్నాయి.

మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఇంగ్రిట్ వాలెన్సియాపై మేరీ కోమ్  5-0 తేడాతో గెలుపొందింది. మరోవైపు, ఇదే ఛాంపియన్ షిప్ లో భారత మహిళా బాక్సర్లు లోవ్లినా బోర్గోహైన్ (69 కేజీల విభాగం), జమున బోరో (54 కేజీల విభాగం), మంజు రాణి (48 కేజీల విభాగం) సెమీఫైనల్స్ లో తమ ప్రత్యర్థులతో తలబడనున్నారు

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...