Skip to main content

కేంద్రం నిధులను ప్రజలకు చేర్చాల్సిన బాధ్యత సీఎం జగన్ పై ఉంది: బీజేపీ నేత సునీల్ దేవధర్




జలశక్తి అభియాన్ ద్వారా కేంద్రం ఏపీకి రూ. వెయ్యి కోట్లు కేటాయించిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ అన్నారు. తిరుపతిలో గాంధీ సంకల్ప యాత్రను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ నిధులను ప్రజలకు చేర్చాల్సిన బాధ్యత సీఎం జగన్ పై ఉందని అన్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఏపీలో బీజేపీ ప్రయాణం సజావుగా సాగుతోందని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయితీ సహా ఏపీలో జరిగే అన్ని ఎన్నికల్లోనూ బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఏపీలో 48 వేలకు పైగా బూత్ కమిటీల్లో ప్రస్తుతం 11 వేల బూత్ కమిటీలు పూర్తయ్యాయయని చెప్పడం సంతోషంగా ఉందని అన్నారు.   

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.