Skip to main content

నువ్వు చెలాయించిన అధికారంలో మేం వీసమెత్తు కూడా చెలాయించడంలేదే!: చంద్రబాబుపై బొత్స ఫైర్

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎదురుదాడికి దిగారు. అనుభవం ఉందని చెప్పుకోవడం కాకుండా, ఏదైనా అంశంలో తప్పు జరిగిందని చెబితే సరిదిద్దుకుంటామని, అంతేతప్ప జరిగినవీ, జరగనివీ అన్నింటికి ముడిపెట్టి లబ్దిపొందాలని చూడడం సబబు కాదని హితవు పలికారు. "ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు అమాయకులనుకుంటున్నావా నువ్వు? తప్పు తప్పు! నీలో ఏదైనా గౌరవం మిగిలుంటే కనీసం అదైనా దాచుకోవడానికి ప్రయత్నించు" అంటూ వ్యాఖ్యానించారు.

"నువ్వు ఎంత అధికారం చెలాయించి ఉంటావు, దాంట్లో కనీసం వీసమెత్తు అయినా మేం చెలాయించి ఉంటామా చెప్పండి!" అంటూ అడిగారు. "నువ్వు చెలాయించిన అధికారంతో పోలిస్తే మేం పది శాతం కూడా చెలాయించడంలేదు. ఆ విధంగా మేమూ చేస్తే నువ్వు భరించలేవేమో!" అంటూ విమర్శించారు.

"నీ జులుం కానీ, నీ అహంభావం కానీ, నీ పార్టీ నేతలను, కార్యకర్తలను నువ్వు పెట్టే హింసలు కానీ, అవమానాలు కానీ మేం వీసమెత్తు కూడా చేయడంలేదే! దేనికోసం నీ ఆక్రోశం!" అంటూ బొత్స తనదైన శైలిలో స్పందించారు. చంద్రబాబునాయుడు ఇటీవల ప్రభుత్వ విధానాలను సునిశితంగా విమర్శిస్తున్న నేపథ్యంలో బొత్స కాస్త ఘాటుగా వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.   

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...