Skip to main content

నువ్వు చెలాయించిన అధికారంలో మేం వీసమెత్తు కూడా చెలాయించడంలేదే!: చంద్రబాబుపై బొత్స ఫైర్

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎదురుదాడికి దిగారు. అనుభవం ఉందని చెప్పుకోవడం కాకుండా, ఏదైనా అంశంలో తప్పు జరిగిందని చెబితే సరిదిద్దుకుంటామని, అంతేతప్ప జరిగినవీ, జరగనివీ అన్నింటికి ముడిపెట్టి లబ్దిపొందాలని చూడడం సబబు కాదని హితవు పలికారు. "ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు అమాయకులనుకుంటున్నావా నువ్వు? తప్పు తప్పు! నీలో ఏదైనా గౌరవం మిగిలుంటే కనీసం అదైనా దాచుకోవడానికి ప్రయత్నించు" అంటూ వ్యాఖ్యానించారు.

"నువ్వు ఎంత అధికారం చెలాయించి ఉంటావు, దాంట్లో కనీసం వీసమెత్తు అయినా మేం చెలాయించి ఉంటామా చెప్పండి!" అంటూ అడిగారు. "నువ్వు చెలాయించిన అధికారంతో పోలిస్తే మేం పది శాతం కూడా చెలాయించడంలేదు. ఆ విధంగా మేమూ చేస్తే నువ్వు భరించలేవేమో!" అంటూ విమర్శించారు.

"నీ జులుం కానీ, నీ అహంభావం కానీ, నీ పార్టీ నేతలను, కార్యకర్తలను నువ్వు పెట్టే హింసలు కానీ, అవమానాలు కానీ మేం వీసమెత్తు కూడా చేయడంలేదే! దేనికోసం నీ ఆక్రోశం!" అంటూ బొత్స తనదైన శైలిలో స్పందించారు. చంద్రబాబునాయుడు ఇటీవల ప్రభుత్వ విధానాలను సునిశితంగా విమర్శిస్తున్న నేపథ్యంలో బొత్స కాస్త ఘాటుగా వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.   

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...