Skip to main content

ఇక 'నాగార్జున సాగర్' ఆయకట్టుపై దృష్టి సారిస్తా: సీఎం కేసీఆర్



హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ విజయం సాధించిన సందర్భంగా  ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నీటి సమస్యలను తొలగిస్తామని చెప్పారు. అనేక అవమానాలు ఎదుర్కొని తెలంగాణ సాధించుకున్నామని, ఎన్నో లక్ష్యాలతో పనిచేస్తున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందని, తెలంగాణలో కోటీ 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉందన్నారు.

‘నాగార్జున సాగర్ ఆయకట్టుపై దృష్టి సారిస్తా. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి సమస్యలు శాశ్వతంగా తొలగిపోవాలి. గోదావరి నీళ్లతో సాగర్ ఎడమ కాల్వ పొంగిపొర్లాలి. రైతులతో కలిసి ఈ ప్రాంతంలో పర్యటించి నీటి కష్టాలను తొలగిస్తాం. ఐడీసీ, నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న దాదాపు 600 లిఫ్టుల నిర్వహణ వ్యయాలను ప్రభుత్వమే భరిస్తుంది. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టు, మహబూబ్ నగర్ లో పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేయాల్సి ఉంది. అప్పుడే తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది’ అని కేసీఆర్ అన్నారు.

అంతకు ముందు తన ప్రసంగంలో కేసీఆర్ హుజూర్ నగర్ నియోజక వర్గ వాసులపై వరాల జల్లు కురిపించారు. సైదిరెడ్డిని గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.  

Comments

Popular posts from this blog

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.