Skip to main content

ఇక 'నాగార్జున సాగర్' ఆయకట్టుపై దృష్టి సారిస్తా: సీఎం కేసీఆర్



హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ విజయం సాధించిన సందర్భంగా  ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నీటి సమస్యలను తొలగిస్తామని చెప్పారు. అనేక అవమానాలు ఎదుర్కొని తెలంగాణ సాధించుకున్నామని, ఎన్నో లక్ష్యాలతో పనిచేస్తున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందని, తెలంగాణలో కోటీ 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉందన్నారు.

‘నాగార్జున సాగర్ ఆయకట్టుపై దృష్టి సారిస్తా. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి సమస్యలు శాశ్వతంగా తొలగిపోవాలి. గోదావరి నీళ్లతో సాగర్ ఎడమ కాల్వ పొంగిపొర్లాలి. రైతులతో కలిసి ఈ ప్రాంతంలో పర్యటించి నీటి కష్టాలను తొలగిస్తాం. ఐడీసీ, నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న దాదాపు 600 లిఫ్టుల నిర్వహణ వ్యయాలను ప్రభుత్వమే భరిస్తుంది. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టు, మహబూబ్ నగర్ లో పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేయాల్సి ఉంది. అప్పుడే తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది’ అని కేసీఆర్ అన్నారు.

అంతకు ముందు తన ప్రసంగంలో కేసీఆర్ హుజూర్ నగర్ నియోజక వర్గ వాసులపై వరాల జల్లు కురిపించారు. సైదిరెడ్డిని గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.  

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...