Skip to main content

ఇక 'నాగార్జున సాగర్' ఆయకట్టుపై దృష్టి సారిస్తా: సీఎం కేసీఆర్



హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ విజయం సాధించిన సందర్భంగా  ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నీటి సమస్యలను తొలగిస్తామని చెప్పారు. అనేక అవమానాలు ఎదుర్కొని తెలంగాణ సాధించుకున్నామని, ఎన్నో లక్ష్యాలతో పనిచేస్తున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందని, తెలంగాణలో కోటీ 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉందన్నారు.

‘నాగార్జున సాగర్ ఆయకట్టుపై దృష్టి సారిస్తా. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి సమస్యలు శాశ్వతంగా తొలగిపోవాలి. గోదావరి నీళ్లతో సాగర్ ఎడమ కాల్వ పొంగిపొర్లాలి. రైతులతో కలిసి ఈ ప్రాంతంలో పర్యటించి నీటి కష్టాలను తొలగిస్తాం. ఐడీసీ, నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న దాదాపు 600 లిఫ్టుల నిర్వహణ వ్యయాలను ప్రభుత్వమే భరిస్తుంది. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టు, మహబూబ్ నగర్ లో పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేయాల్సి ఉంది. అప్పుడే తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది’ అని కేసీఆర్ అన్నారు.

అంతకు ముందు తన ప్రసంగంలో కేసీఆర్ హుజూర్ నగర్ నియోజక వర్గ వాసులపై వరాల జల్లు కురిపించారు. సైదిరెడ్డిని గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.  

Comments

Popular posts from this blog

Android ఫోన్లలో బ్యాంక్ అకౌంట్ వివరాలు దోచుకునే కొత్త మాల్వేర్ 'BlackRock' హడలెత్తిస్తోంది

Trojan కేటగిరికి చెందినదిగా చెబుతున్న 'BlackRock' అనే ఒక మాల్వేర్ Android స్మార్ట్ ఫోన్ల నుండి వినియోగదారుల విలువైన బ్యాంక్ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు బయటపడింది. ఇప్పటి వరకూ పర్సనల్ డేటా చౌర్యానికి మాత్రమే పరిమితమైన సైబర్ దాడులు ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల నుండి బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా దోచుకునేంతగా ముందుకు సాగుతోంది. ఒక మాల్వేర్, బ్యాంక్ అకౌంట్ ఆధారాలను మరియు క్రెడిట్ కార్డు వాటి వాటి వివరాలను ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల ద్వారా సేకరిస్తున్నట్లు మరియు ఇది దాదాపుగా 300 పైగా ఆండ్రాయిడ్ యాప్స్ పైన తాన్ ప్రభావాన్ని చూపిస్తున్నట్లు తెలిపింది. అసలే ప్రజలు కరోనా మహమ్మారితో దెబ్బకి హడలెత్తి పోతోంటే, ఆన్ లైన్ లో సైబర్ దాడులు మరియు సైబర్ మోసాలు మరింతగా కృంగదీస్తున్నాయి. ఇప్పటి వరకూ పర్సనల్ డేటా చౌర్యానికి మాత్రమే పరిమితమైన సైబర్ దాడులు ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల నుండి బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా దోచుకునేంతగా ముందుకు  సాగుతోంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక నివేదిక ప్రకారం,Trojan కేటగిరికి చెందినదిగా చెబుతున్న 'BlackRock' అనే ఒక మాల్వేర్ Android స...

ఆమిర్‌ ఖాన్‌పై విమర్శలు గుప్పిస్తున్న నెటిజెన్లు

  బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ పై నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, తన తాజా చిత్రం 'లాల్ సింగ్ చద్దా' షూటింగ్ కోసం ఆమిర్ ఇటీవల టర్కీకి వెళ్లారు. ఈ సమయంలో ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు అక్కడి వారు ఉత్సాహం చూపారు. తన పర్యటనలో భాగంగా టర్కీ అధ్యక్షుడి భార్య ఎమినే ఎర్డోగన్ ను కూడా ఆమిర్ కలిశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె తెలిపారు. ప్రముఖ భారతీయ నటుడు ఆమిర్ ను కలవడం సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. టర్కీలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ చేశారని.. ఆ చిత్రాన్ని చూసేందుకు తాను కూడా ఎదురుచూస్తున్నానని ఆమె అన్నారు. ఈ వ్యవహారంపై ఆమిర్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ కు టర్కీ అధ్యక్షుడు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎమినేను ఆమిర్ కలవకుండా వుండి ఉంటే బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.