Skip to main content

ఐసిస్‌ అధినేత హతం..?


ఐసిస్‌ అధినేత హతం..? 
ఇస్లామిక్‌ స్టేట్ ఉగ్రసంస్థ అగ్ర నాయకుడు అబు బకర్‌ ఆల్‌ బగ్దాదీని అమెరికా సైన్యం ఓ రహస్య ఆపరేషన్‌లో మట్టుబెట్టినట్లు సమాచారం. ఐసిస్‌ను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన సీక్రెట్‌ ఆపరేషన్లో యూఎస్‌ ఆర్మీ..అబు బకర్‌ను హతమార్చినట్లు అధికారులు తెలిపారని ‘న్యూస్‌ వీక్‌’ పత్రిక కథనం ప్రచురించింది. ఈ విషయాన్ని రక్షణశాఖ అధికారులు శ్వేతసౌధానికి చేరవేసినట్లు పెంటగాన్‌లోని ఆర్మీ అధికారులు తెలిపినట్లు కథనంలో పేర్కొంది. అబుబకర్‌ను మట్టుబెట్టడానికి అత్యున్నత స్థాయిలో వ్యూహరచన చేశారు. ఈ ఆపరేషన్‌ను వారం క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా ఆమోదించారని తెలిపింది. తాజాగా ట్రంప్‌ ‘ఇప్పుడే ఒక పెద్ద ఘటన జరిగింది’ అని ట్విటర్‌లో పేర్కొనడం దీనికి బలాన్నిస్తోంది.  
సిరియాలో ఆపరేషన్‌..
వాయువ్య సిరియాలో శనివారం అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో బగ్దాదీని మట్టుబెట్టారు. అయితే, దీన్ని ధ్రువీకరించడానికి డీఎన్‌ఏ, బయోమెట్రిక్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. దాడులు జరిపే సమయంలో అతడు ఆత్మాహుతికి యత్నించాడని అధికారులు పేర్కొన్నారు. బగ్దాదీని అంతమొందించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదివారం అధికారికంగా ప్రకటిస్తారని శ్వేత సౌధం వెల్లడించింది. ఈ మేరకు ఈ రోజు ఉదయం ట్రంప్‌ ట్విటర్‌లో ‘ఇప్పుడే ఓ పెద్ద ఘటన జరిగింది’ అని ప్రకటించారు. ఇది మినహా దీనిపై ఎలాంటి వివరాలు ఆయన వెల్లడించలేదు. 2010లో ఐసిస్‌ నేతగా బగ్దాదీ వెలుగులోకి వచ్చాడు. గత ఐదేళ్లుగా అతడు ఓ రహస్య ప్రదేశంలో తలదాచుకుంటున్నాడు. అతడిని మట్టుబెట్టాలని గతేడాది అమెరికా సైన్యం ప్రయత్నించి విఫలమైంది. ఈ సారి మాత్రం పక్కాగా వ్యూహ రచన చేసి హతమార్చింది. సిరియా నుంచి అమెరికా బలగాలు వైదొలుగుతున్న సమయంలో ఐసిస్‌ నేత బగ్దాదీని అంతమొందించడం విశేషం. 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.