Skip to main content

ఐసిస్‌ అధినేత హతం..?


ఐసిస్‌ అధినేత హతం..? 
ఇస్లామిక్‌ స్టేట్ ఉగ్రసంస్థ అగ్ర నాయకుడు అబు బకర్‌ ఆల్‌ బగ్దాదీని అమెరికా సైన్యం ఓ రహస్య ఆపరేషన్‌లో మట్టుబెట్టినట్లు సమాచారం. ఐసిస్‌ను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన సీక్రెట్‌ ఆపరేషన్లో యూఎస్‌ ఆర్మీ..అబు బకర్‌ను హతమార్చినట్లు అధికారులు తెలిపారని ‘న్యూస్‌ వీక్‌’ పత్రిక కథనం ప్రచురించింది. ఈ విషయాన్ని రక్షణశాఖ అధికారులు శ్వేతసౌధానికి చేరవేసినట్లు పెంటగాన్‌లోని ఆర్మీ అధికారులు తెలిపినట్లు కథనంలో పేర్కొంది. అబుబకర్‌ను మట్టుబెట్టడానికి అత్యున్నత స్థాయిలో వ్యూహరచన చేశారు. ఈ ఆపరేషన్‌ను వారం క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా ఆమోదించారని తెలిపింది. తాజాగా ట్రంప్‌ ‘ఇప్పుడే ఒక పెద్ద ఘటన జరిగింది’ అని ట్విటర్‌లో పేర్కొనడం దీనికి బలాన్నిస్తోంది.  
సిరియాలో ఆపరేషన్‌..
వాయువ్య సిరియాలో శనివారం అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో బగ్దాదీని మట్టుబెట్టారు. అయితే, దీన్ని ధ్రువీకరించడానికి డీఎన్‌ఏ, బయోమెట్రిక్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. దాడులు జరిపే సమయంలో అతడు ఆత్మాహుతికి యత్నించాడని అధికారులు పేర్కొన్నారు. బగ్దాదీని అంతమొందించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదివారం అధికారికంగా ప్రకటిస్తారని శ్వేత సౌధం వెల్లడించింది. ఈ మేరకు ఈ రోజు ఉదయం ట్రంప్‌ ట్విటర్‌లో ‘ఇప్పుడే ఓ పెద్ద ఘటన జరిగింది’ అని ప్రకటించారు. ఇది మినహా దీనిపై ఎలాంటి వివరాలు ఆయన వెల్లడించలేదు. 2010లో ఐసిస్‌ నేతగా బగ్దాదీ వెలుగులోకి వచ్చాడు. గత ఐదేళ్లుగా అతడు ఓ రహస్య ప్రదేశంలో తలదాచుకుంటున్నాడు. అతడిని మట్టుబెట్టాలని గతేడాది అమెరికా సైన్యం ప్రయత్నించి విఫలమైంది. ఈ సారి మాత్రం పక్కాగా వ్యూహ రచన చేసి హతమార్చింది. సిరియా నుంచి అమెరికా బలగాలు వైదొలుగుతున్న సమయంలో ఐసిస్‌ నేత బగ్దాదీని అంతమొందించడం విశేషం. 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...