Skip to main content

ఐసిస్‌ అధినేత హతం..?


ఐసిస్‌ అధినేత హతం..? 
ఇస్లామిక్‌ స్టేట్ ఉగ్రసంస్థ అగ్ర నాయకుడు అబు బకర్‌ ఆల్‌ బగ్దాదీని అమెరికా సైన్యం ఓ రహస్య ఆపరేషన్‌లో మట్టుబెట్టినట్లు సమాచారం. ఐసిస్‌ను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన సీక్రెట్‌ ఆపరేషన్లో యూఎస్‌ ఆర్మీ..అబు బకర్‌ను హతమార్చినట్లు అధికారులు తెలిపారని ‘న్యూస్‌ వీక్‌’ పత్రిక కథనం ప్రచురించింది. ఈ విషయాన్ని రక్షణశాఖ అధికారులు శ్వేతసౌధానికి చేరవేసినట్లు పెంటగాన్‌లోని ఆర్మీ అధికారులు తెలిపినట్లు కథనంలో పేర్కొంది. అబుబకర్‌ను మట్టుబెట్టడానికి అత్యున్నత స్థాయిలో వ్యూహరచన చేశారు. ఈ ఆపరేషన్‌ను వారం క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా ఆమోదించారని తెలిపింది. తాజాగా ట్రంప్‌ ‘ఇప్పుడే ఒక పెద్ద ఘటన జరిగింది’ అని ట్విటర్‌లో పేర్కొనడం దీనికి బలాన్నిస్తోంది.  
సిరియాలో ఆపరేషన్‌..
వాయువ్య సిరియాలో శనివారం అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో బగ్దాదీని మట్టుబెట్టారు. అయితే, దీన్ని ధ్రువీకరించడానికి డీఎన్‌ఏ, బయోమెట్రిక్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. దాడులు జరిపే సమయంలో అతడు ఆత్మాహుతికి యత్నించాడని అధికారులు పేర్కొన్నారు. బగ్దాదీని అంతమొందించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదివారం అధికారికంగా ప్రకటిస్తారని శ్వేత సౌధం వెల్లడించింది. ఈ మేరకు ఈ రోజు ఉదయం ట్రంప్‌ ట్విటర్‌లో ‘ఇప్పుడే ఓ పెద్ద ఘటన జరిగింది’ అని ప్రకటించారు. ఇది మినహా దీనిపై ఎలాంటి వివరాలు ఆయన వెల్లడించలేదు. 2010లో ఐసిస్‌ నేతగా బగ్దాదీ వెలుగులోకి వచ్చాడు. గత ఐదేళ్లుగా అతడు ఓ రహస్య ప్రదేశంలో తలదాచుకుంటున్నాడు. అతడిని మట్టుబెట్టాలని గతేడాది అమెరికా సైన్యం ప్రయత్నించి విఫలమైంది. ఈ సారి మాత్రం పక్కాగా వ్యూహ రచన చేసి హతమార్చింది. సిరియా నుంచి అమెరికా బలగాలు వైదొలుగుతున్న సమయంలో ఐసిస్‌ నేత బగ్దాదీని అంతమొందించడం విశేషం. 

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

పుట్టినరోజు కేక్ కట్ చేయడంపై తన అభిప్రాయాలు వెల్లడించిన పవన్ కల్యాణ్

 జనసేన పార్టీ అధ్యక్షుడు, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినోత్సవం (సెప్టెంబరు 2) సందర్భంగా ఆయన అభిమానుల్లో కోలాహలం నెలకొంది. ఆయన మాత్రం ఎప్పటిలాగానే ఎంతో కూల్ గా కనిపించారు. తన బర్త్ డే సందర్భంగా పెద్దగా ఎప్పుడూ కేకులు కట్ చేయని పవన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. చిన్నప్పటి నుంచి తనకు బర్త్ డే వేడుకలపై ఆసక్తి తక్కువని తెలిపారు. ఒకట్రెండు సార్లు స్కూల్లో చాక్లెట్లు పంచానని, కొన్ని సందర్భాల్లో తన కుటుంబ సభ్యులు కూడా తన పుట్టినరోజు సంగతి మర్చిపోయేవారని వెల్లడించారు. ఎప్పుడైనా తన పుట్టినరోజు సంగతి గుర్తొస్తే వదిన డబ్బులు ఇచ్చేవారని, ఆ డబ్బులతో పుస్తకాలు కొనుక్కోవడం తప్ప ప్రత్యేకమైన వేడుకలు తక్కువేనని పవన్ వివరించారు. "ఇక సినీ రంగంలోకి వచ్చిన తర్వాత నా పుట్టినరోజు వేడుకలను ఫ్రెండ్స్, నిర్మాతలు చేస్తుంటే ఇబ్బందికరంగా అనిపించేది. కేకు కోయడం, ఆ కేకు ముక్కలను నోట్లో పెట్టడం అంతా ఎబ్బెట్టుగా అనిపించేది. అందుకే జన్మదిన వేడుకలంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు... దీనికి వేరే కారణాలేవీ లేవు" అని పవన్ తెలిపారు.