Skip to main content

గరుడసేవకు ఒక్కరోజు ముందే తిరుమలలో లక్షలాది మంది భక్తులు..


తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం గరుడ సేవ. స్వామివారికి ఎంతో ఇష్టమైంది గరుత్మంతుడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని గరుడ సేవరోజు తిలకిస్తే సకల పాపాలు తొలగిపోయి మంచి జరుగుతుందన్నది భక్తుల నమ్మకం. అందుకే ఆ స్వామిని చూసేందుకు భక్తులు ప్రపంచ నలుమూలల నుంచి భారీగా తరలివస్తున్నారు

అంతే కాదు రేపు గరుడ సేవ జరుగనుండగా ఈరోజుకే లక్షలాదిమంది జనం తిరుమలకు చేరుకున్నారు. తిరుపతి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో గోవింద మాలలు ధరించిన భక్తులు సేదతీరుతున్నారు. ఆ స్వామివారిని కనులారా వీక్షించేందుకు భక్తులు తండోతండాలుగా తరలివస్తున్నారు.

ప్రతి యేడాది గరుడోత్సవం రోజు 4నుంచి 5లక్షలమంది జనం శ్రీవారిని దర్సించుకుంటారు. అలాంటిది ఈ యేడాది ఆ సంఖ్య పెరిగే అవకాశముందని టిటిడి అంచనా వేస్తోంది. ఒకరోజు ముందుగానే భక్తజనం విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో టిటిడి ఎలాంటి ఏర్పాట్లు చేస్తుందనేది ప్రశ్నార్థంకంగా మారుతోంది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.