Skip to main content

బీజేపీతో చేరే ఇండిపెండెంట్లను జనాలు చెప్పులతో కొడతారు: దీపేందర్ సింగ్ హుడా




హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ ఓటర్లు స్పష్టమైన మెజార్టీ ఇవ్వకపోవడంతో... బీజేపీ, కాంగ్రెస్ లు ఇతరుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. 10 సీట్లను గెల్చుకున్న జేజేపీ అధినేత దుష్యంత్ కాసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ, బీజేపీకి మద్దతిచ్చే ఆలోచన తమకు లేదని చెప్పారు. ఈ పరిణామాలను ముందే ఊహించిన బీజేపీ అధిష్ఠానం ఇండిపెండెంట్లను ఆకర్షించే ప్రయత్నంలో బిజీగా ఉంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత దీపేందర్ సింగ్ హుడా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, బీజేపీకి స్వతంత్ర అభ్యర్థులు మద్దతు తెలిపితే... వారిని జనాలు చెప్పుతో కొడతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో జతకలిసే ఇండిపెండెంట్లు వారి గొయ్యి వారే తవ్వుకున్నట్టని చెప్పారు. అలా చేసే ఇండిపెండెంట్లను ప్రజలు క్షమించరని... సరైన సమయంలో చెప్పులతో సమాధానం చెబుతారని అన్నారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.