Skip to main content

పెట్టుబడిదారులు ఏపీవైపు కన్నెత్తి చూడడం లేదు : యనమల


రాష్ట్రంలో ప్రగతి పతనావస్థకు చేరిందని, పెట్టుబడిదారులు ఎవరూ రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. ఇందుకు నీతి అయోగ్‌ నివేదిక సాక్ష్యమని చెప్పారు. ఈ నివేదికలో ఆంధ్రప్రదేశ్‌ పదో స్థానంలో నిలిచిందని, దక్షిణాదిలో చిట్ట చివరిన ఉందని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సులభతర వాణిజ్యంతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. పెట్టుబడిదారులను, పారిశ్రామిక వేత్తలను ఆకర్షించామన్నారు. జగన్‌ హయాంలో తలసరి ఆదాయం రూ.17 వేలకు పడిపోయిందని చెప్పారు. ఎలాంటి పెట్టుబడులు, ఉద్యోగాలు, ఆర్థికాభిచృద్ధి లేదని స్పష్టమవుతోందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైందని, ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో  ప్రభుత్వం చెప్పాలన్నారు. 




రాష్ట్రంలో ప్రగతి పతనావస్థకు చేరిందని, పెట్టుబడిదారులు ఎవరూ రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. ఇందుకు నీతి అయోగ్‌ నివేదిక సాక్ష్యమని చెప్పారు. ఈ నివేదికలో ఆంధ్రప్రదేశ్‌ పదో స్థానంలో నిలిచిందని, దక్షిణాదిలో చిట్ట చివరిన ఉందని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సులభతర వాణిజ్యంతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. పెట్టుబడిదారులను, పారిశ్రామిక వేత్తలను ఆకర్షించామన్నారు. జగన్‌ హయాంలో తలసరి ఆదాయం రూ.17 వేలకు పడిపోయిందని చెప్పారు. ఎలాంటి పెట్టుబడులు, ఉద్యోగాలు, ఆర్థికాభిచృద్ధి లేదని స్పష్టమవుతోందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైందని, ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో  ప్రభుత్వం చెప్పాలన్నారు. 





రాష్ట్రంలో ప్రగతి పతనావస్థకు చేరిందని, పెట్టుబడిదారులు ఎవరూ రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. ఇందుకు నీతి అయోగ్‌ నివేదిక సాక్ష్యమని చెప్పారు. ఈ నివేదికలో ఆంధ్రప్రదేశ్‌ పదో స్థానంలో నిలిచిందని, దక్షిణాదిలో చిట్ట చివరిన ఉందని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సులభతర వాణిజ్యంతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. పెట్టుబడిదారులను, పారిశ్రామిక వేత్తలను ఆకర్షించామన్నారు. జగన్‌ హయాంలో తలసరి ఆదాయం రూ.17 వేలకు పడిపోయిందని చెప్పారు. ఎలాంటి పెట్టుబడులు, ఉద్యోగాలు, ఆర్థికాభిచృద్ధి లేదని స్పష్టమవుతోందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైందని, ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో  ప్రభుత్వం చెప్పాలన్నారు.   

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...