Skip to main content

బిగ్‌బాస్’ పథకం.. శ్రీముఖిని విన్నర్ చేయడానికేనా..!

తెలుగు బుల్లితెరపై విజయవంతంగా కొనసాగుతోన్న ‘బిగ్‌బాస్’ మూడో సీజన్ ఈ వారం ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హౌస్‌లో ఐదుగురు ఉండగా.. ఈ సీజన్‌కు టైటిల్ విన్నర్‌గా ఎవరు నిలుస్తారు అన్న దానిపై చర్చ నడుస్తోంది. అయితే ఇప్పుడు ఈ రేసులో శ్రీముఖి ముందు వరుసలో నిలిచింది. ఇటీవల పోలైన ఓట్లలో శ్రీముఖి ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. దీంతో టైటిల్ విన్నర్‌గా కూడా ఆమెనే నిలిచే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. అంతేకాదు మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్‌గా శ్రీముఖిని చేసేందుకు తెరవెనుక వ్యూహాలు జరుగుతున్నాయని కూడా టాక్ నడుస్తోంది.
దానికి తోడు ఇటీవల శ్రీముఖి గెలిచిన కొన్ని టాస్క్‌లు ప్రత్యేకంగా ఆమె కోసమే డిజైన్ చేశారా..? అన్నట్లు ఉన్నాయి. ఈ విషయాన్ని నెటిజన్లు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. అంతేకాదు గతంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన హిమజ, మహేష్ విట్టా, హేమలు కూడా ఇలాంటి విమర్శలే చేశారు. హిమజ అయితే ఏకంగా బిగ్ బాస్ డైరెక్టర్లే శ్రీముఖి డెరెక్షన్‌లో షో నడిపిస్తున్నారని ఆరోపణలు చేసింది. హేమ కూడా ఇదే విషయంపై తాజాగా స్పందిస్తూ.. హౌస్‌లో ఎవరు ఎన్నాళ్లు ఉండాలి. ముందే ఫిక్స్ అయ్యి వచ్చారని దాని ప్రకారం ఆట జరుగుతుందని, మొత్తం బిగ్ బాస్ ఆటని శ్రీముఖి ఆడిస్తుందని ఆమె ఆటలో కంటెస్టెంట్స్ బలి అవుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాదు శ్రీముఖిని విన్నర్‌ను చేసేందుకే ఆమెకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్న హిమజ లాంటి వాళ్లను ఎలిమినేట్ చేశారని అప్పట్లో విమర్శలు కూడా వినిపించాయి.
ఇక బిగ్‌బాస్ డైరక్టర్‌ అయిన అభిషేక్ ముఖర్జీ, శ్యామ్ ఇద్దరూ.. శ్రీముఖికి చాలా క్లోజ్. దీంతో వారు కూడా శ్రీముఖినే విన్నర్ కావాలని ఇదంతా చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారాలన్నింటిని శ్రీముఖి ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు. శ్రీముఖి మొదటి నుంచి జెన్యూన్‌గానే ఆటను ఆడుతుందని వారు అంటున్నారు. మరి శ్రీముఖిని విన్నర్ చేసేందుకే నిర్వాహకులు ప్లాన్ చేశారా..? రెండు సీజన్ల రికార్డును బ్రేక్ చేసి శ్రీముఖి టైటిల్‌ను గెలుచుకుంటుందా..? అసలు బిగ్‌బాస్ 3 సీజన్ విన్నర్ ఎవరు..? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఈ వారాంతంలోనే తేలనుంది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...