Skip to main content

బిగ్‌బాస్’ పథకం.. శ్రీముఖిని విన్నర్ చేయడానికేనా..!

తెలుగు బుల్లితెరపై విజయవంతంగా కొనసాగుతోన్న ‘బిగ్‌బాస్’ మూడో సీజన్ ఈ వారం ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హౌస్‌లో ఐదుగురు ఉండగా.. ఈ సీజన్‌కు టైటిల్ విన్నర్‌గా ఎవరు నిలుస్తారు అన్న దానిపై చర్చ నడుస్తోంది. అయితే ఇప్పుడు ఈ రేసులో శ్రీముఖి ముందు వరుసలో నిలిచింది. ఇటీవల పోలైన ఓట్లలో శ్రీముఖి ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. దీంతో టైటిల్ విన్నర్‌గా కూడా ఆమెనే నిలిచే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. అంతేకాదు మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్‌గా శ్రీముఖిని చేసేందుకు తెరవెనుక వ్యూహాలు జరుగుతున్నాయని కూడా టాక్ నడుస్తోంది.
దానికి తోడు ఇటీవల శ్రీముఖి గెలిచిన కొన్ని టాస్క్‌లు ప్రత్యేకంగా ఆమె కోసమే డిజైన్ చేశారా..? అన్నట్లు ఉన్నాయి. ఈ విషయాన్ని నెటిజన్లు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. అంతేకాదు గతంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన హిమజ, మహేష్ విట్టా, హేమలు కూడా ఇలాంటి విమర్శలే చేశారు. హిమజ అయితే ఏకంగా బిగ్ బాస్ డైరెక్టర్లే శ్రీముఖి డెరెక్షన్‌లో షో నడిపిస్తున్నారని ఆరోపణలు చేసింది. హేమ కూడా ఇదే విషయంపై తాజాగా స్పందిస్తూ.. హౌస్‌లో ఎవరు ఎన్నాళ్లు ఉండాలి. ముందే ఫిక్స్ అయ్యి వచ్చారని దాని ప్రకారం ఆట జరుగుతుందని, మొత్తం బిగ్ బాస్ ఆటని శ్రీముఖి ఆడిస్తుందని ఆమె ఆటలో కంటెస్టెంట్స్ బలి అవుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాదు శ్రీముఖిని విన్నర్‌ను చేసేందుకే ఆమెకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్న హిమజ లాంటి వాళ్లను ఎలిమినేట్ చేశారని అప్పట్లో విమర్శలు కూడా వినిపించాయి.
ఇక బిగ్‌బాస్ డైరక్టర్‌ అయిన అభిషేక్ ముఖర్జీ, శ్యామ్ ఇద్దరూ.. శ్రీముఖికి చాలా క్లోజ్. దీంతో వారు కూడా శ్రీముఖినే విన్నర్ కావాలని ఇదంతా చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారాలన్నింటిని శ్రీముఖి ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు. శ్రీముఖి మొదటి నుంచి జెన్యూన్‌గానే ఆటను ఆడుతుందని వారు అంటున్నారు. మరి శ్రీముఖిని విన్నర్ చేసేందుకే నిర్వాహకులు ప్లాన్ చేశారా..? రెండు సీజన్ల రికార్డును బ్రేక్ చేసి శ్రీముఖి టైటిల్‌ను గెలుచుకుంటుందా..? అసలు బిగ్‌బాస్ 3 సీజన్ విన్నర్ ఎవరు..? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఈ వారాంతంలోనే తేలనుంది.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...