Skip to main content

సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం.. ఇకపై అలా కుదరదు


ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ఇస్తున్న హామీలు, తీసుకుంటున్న నిర్ణయాల అమలులో జాప్యం జరుగుతుందనే విషయాన్ని గమనించిన సీఎం జగన్... ఈ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్ ఆదేశాలు అమలు కాకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సీఎంవో... సీఎం ఆదేశాలు సమయానుగుణంగా అమలు కాకపోవడంతో సంక్షేమ పథకాల అమల్లో ఇబ్బందులు తలెత్తున్నాయని భావిస్తోంది. ఈ కారణంగా వాటి తీవ్ర తగ్గుతుందనే భావనలో సీఎంవో కార్యాలయం ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏపీ బిజినెస్ రూల్స్ 2018లో సవరణలు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

కార్యదర్శుల నుంచి సీఎంకు ఈ-ఆఫీస్ ద్వారా పంపే ఫైళ్లు మూడు కేటగిరీలుగా విభజిస్తూ నిర్ణయం తీసుకుంది. అదేరోజు లేదా మోస్ట్ ఇమీడియేట్, ఇమీడియేట్‌గా విభజన చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ శాఖ నుంచి వచ్చే ఫైళ్లకు ఆర్ధిక, న్యాయశాఖల నుంచి క్లియరెన్స్ తీసుకునేందుకు గడువు విధించింది. వివిధ శాఖల నుంచి వచ్చే ఫైళ్లను ఆర్ధిక, న్యాయశాఖలు రెండు రోజుల్లో క్లియర్ చేసేలా ఆదేశించింది. మిగతా శాఖలు ఒక రోజులో క్లియర్ చేసేలా ఆదేశాలు ఇచ్చారు. నిర్ణీత సమయంలో క్లియర్ కాకపోతే వాటిని ఆటోమేటిక్‌గా క్లియర్ అయినట్లు గుర్తించనున్నారు.

సీఎం ఆమోదం తర్వాత 15 రోజుల్లోగా జీవో విడుదల కావాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆమోదం తర్వాత నిర్ణీత సమయంలో జీవోలు ఇవ్వకపోతే కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నారు. మీడియాకు సంబంధం ఉన్న అంశాల్లో సీఎంకు తెలియకుండా మంత్రులు, అధికారులు జీవోలు ఇవ్వరాదని ఆదేశాలు జారీ చేశారు. సీఎంకు పంపిన ముసాయిదా ఉత్తర్వులపై సీఎంవో నుంచి ఐదురోజుల్లోగా స్పందన రాకపోతే ఆమోదంగా గుర్తించి జీవో విడుదల చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...