Skip to main content

సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం.. ఇకపై అలా కుదరదు


ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ఇస్తున్న హామీలు, తీసుకుంటున్న నిర్ణయాల అమలులో జాప్యం జరుగుతుందనే విషయాన్ని గమనించిన సీఎం జగన్... ఈ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్ ఆదేశాలు అమలు కాకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సీఎంవో... సీఎం ఆదేశాలు సమయానుగుణంగా అమలు కాకపోవడంతో సంక్షేమ పథకాల అమల్లో ఇబ్బందులు తలెత్తున్నాయని భావిస్తోంది. ఈ కారణంగా వాటి తీవ్ర తగ్గుతుందనే భావనలో సీఎంవో కార్యాలయం ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏపీ బిజినెస్ రూల్స్ 2018లో సవరణలు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

కార్యదర్శుల నుంచి సీఎంకు ఈ-ఆఫీస్ ద్వారా పంపే ఫైళ్లు మూడు కేటగిరీలుగా విభజిస్తూ నిర్ణయం తీసుకుంది. అదేరోజు లేదా మోస్ట్ ఇమీడియేట్, ఇమీడియేట్‌గా విభజన చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ శాఖ నుంచి వచ్చే ఫైళ్లకు ఆర్ధిక, న్యాయశాఖల నుంచి క్లియరెన్స్ తీసుకునేందుకు గడువు విధించింది. వివిధ శాఖల నుంచి వచ్చే ఫైళ్లను ఆర్ధిక, న్యాయశాఖలు రెండు రోజుల్లో క్లియర్ చేసేలా ఆదేశించింది. మిగతా శాఖలు ఒక రోజులో క్లియర్ చేసేలా ఆదేశాలు ఇచ్చారు. నిర్ణీత సమయంలో క్లియర్ కాకపోతే వాటిని ఆటోమేటిక్‌గా క్లియర్ అయినట్లు గుర్తించనున్నారు.

సీఎం ఆమోదం తర్వాత 15 రోజుల్లోగా జీవో విడుదల కావాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆమోదం తర్వాత నిర్ణీత సమయంలో జీవోలు ఇవ్వకపోతే కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నారు. మీడియాకు సంబంధం ఉన్న అంశాల్లో సీఎంకు తెలియకుండా మంత్రులు, అధికారులు జీవోలు ఇవ్వరాదని ఆదేశాలు జారీ చేశారు. సీఎంకు పంపిన ముసాయిదా ఉత్తర్వులపై సీఎంవో నుంచి ఐదురోజుల్లోగా స్పందన రాకపోతే ఆమోదంగా గుర్తించి జీవో విడుదల చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...