Skip to main content

మా’లో తార స్థాయికి చేరిన వివాదం.. కాసేపట్లో జరిగే సమావేశంపై ఉత్కంఠ




మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడు నరేశ్‌, ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌ మధ్య నెలకొన్న విభేదాలు తారస్థాయికి చేరినట్లు సమాచారం. వారిద్దరి మధ్య వివాదం ఉందన్న విషయాన్ని మా ఇప్పటికే ఖండించినప్పటికీ ప్రస్తుతం కొనసాగుతున్న పరిణామాలు చేస్తుంటే విభేదాలు మరింత పెరిగినట్లు అర్థమవుతోంది. మా సభ్యుల సమావేశం ఉందని జీవితా రాజశేఖర్‌ మెసేజ్ పంపడంతో నరేశ్‌ కార్యవర్గం విస్మయానికి గురయ్యారు. అయితే, ఈ రోజు జరిగేది జనరల్‌ బాడీ మీటింగ్‌ కాదని కేవలం స్నేహపూర్వక సమావేశం మాత్రమేనని జీవితా రాజశేఖర్ అంటున్నారు.

అధ్యక్షుడు నరేశ్ లేకుండా ఈ సమావేశం ఎలా నిర్వహిస్తారని నరేశ్‌ తరుఫు న్యాయవాది నిలదీస్తున్నారు. మరికాసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది. నరేశ్‌కు షోకాజ్‌ నోటీసుల ఇవ్వాలని రాజశేఖర్‌ కార్యవర్గం యోచించినట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఉత్కంఠ నెలకొంది. ఇది స్నేహపూర్వక సమావేశమేనని మా ముఖ్య సలహాదారు కృష్ణంరాజు కూడా అంటున్నారు. ఈ సమవేశానికి వచ్చిన వారితో ఎలాంటి సంతకాలు పెట్టించబోమని తెలిపారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...