Skip to main content

ఆ ఫిర్యాదులను నిష్పక్షపాతంగా ఎదుర్కొంటాము.. ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నందన్ నీలేకని


 


భారత్ కు చెందిన రెండో అతి పెద్ద ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నతాధికారులపై అవినీతి ఫిర్యాదుల నేపథ్యంలో సంస్థ సహ వ్యవస్థాపకుడు, నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నందన్ నీలేకని స్పందిస్తూ.. ఈ ఫిర్యాదులను నిష్పక్షపాతంగా, అంశాలవారీగా ఎదుర్కొంటామని చెప్పారు. మరోవైపు ఈ ఫిర్యాదుల మూలంగా సంస్థ షేర్ విలువ నేడు 16 శాతం క్షీణించింది. సంస్థకు చెందిన గుర్తు తెలియని ఉద్యోగులు సీఈవో సలీల్ పారెఖ్, సీఎఫ్ వో నీలాంజన్ రాయ్ లపై ఫిర్యాదు చేస్తూ బోర్డుకు లేఖలు రాశారు. కంపెనీ లాభాలను పెంచి చూపేందుకు వీరు అకౌంటింగ్ లో అనైతిక చర్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. వీరి ఫిర్యాదులను ఆడిట్ కమిటీ ముందు పెడతామని బోర్డు ప్రకటించింది.

నందన్ నీలేకని వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి...

* కంపెనీ బోర్డు సభ్యుడొకరు 30 సెప్టెంబర్ 2019న రెండు ఫిర్యాదులను అందుకున్నారు.   20 సెప్టెంబర్ 2019 అని తేదీ రాసి ఉన్న లేఖలో  ‘అనైతిక చర్యలతో కంపెనీకి హాని’ అని టైటిల్ ఉండగా, రెండో లేఖలో తేదీని పేర్కొనలేదు. టైటిల్ ‘ విజిల్ బ్లోయర్ ఫిర్యాదు’ అని ఉంది.

* విజిల్ బ్లోయర్ (ప్రజావేగు) ఫిర్యాదులపై స్పందనగా  అక్టోబర్ 10, 2019 న వాటిని ఆడిట్ కమిటీ ముందు పెట్టాము. అక్టోబర్ 11న నాన్ ఎగ్జిక్యూటివ్ సభ్యులతో కూడిన బోర్డుకు సమర్పించారు.

* ఈ ఫిర్యాదులను ఒక్కో అంశంగా తీసుకొని విచారణ చేస్తాము. విచారణ నిష్పక్షపాతంగా సాగుతుంది. తేదీ పేర్కొనని ఫిర్యాది లేఖలో సీఈవోపై ఫిర్యాదులున్నాయి. ఆయన అమెరికా, ముంబైలకు జరిపిన ప్రయాణాలపై ఆరోపణలున్నాయి.

* అక్టోబర్ 3, 2019న ఫిర్యాదుదారులు లేఖను విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ ప్రొగ్రామ్, వాషింగ్టన్ డి.సికి రాసినట్టు మాకు అక్టోబర్ 16న తెలిసింది.

* ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదులకు సంబంధించి వాయిస్ రికార్డింగ్ లు, ఇతర సాక్ష్యాలు పంపలేదు. అయినప్పటికి వీరి ఆరోపణలపై మేము పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నాము.

* ఆడిట్ కమిటీకి తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్11నే అది విచారణ ప్రారంభించింది.  స్వతంత్ర అంతర్గత ఆడిటర్స్ ( ఎర్నెస్ట్ అండ్ యంగ్ ) తో సంప్రదింపులు ప్రారంభించింది. కంపెనీకి చెందిన లీగల్ వ్యవహారాలను షార్దూల్ అమర్ చంద్ మంగల్ దాస్ అండ్ కో స్వంతంత్రంగా చూసుకుంటుంది.   

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...