Skip to main content

ఆ ఫిర్యాదులను నిష్పక్షపాతంగా ఎదుర్కొంటాము.. ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నందన్ నీలేకని


 


భారత్ కు చెందిన రెండో అతి పెద్ద ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నతాధికారులపై అవినీతి ఫిర్యాదుల నేపథ్యంలో సంస్థ సహ వ్యవస్థాపకుడు, నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నందన్ నీలేకని స్పందిస్తూ.. ఈ ఫిర్యాదులను నిష్పక్షపాతంగా, అంశాలవారీగా ఎదుర్కొంటామని చెప్పారు. మరోవైపు ఈ ఫిర్యాదుల మూలంగా సంస్థ షేర్ విలువ నేడు 16 శాతం క్షీణించింది. సంస్థకు చెందిన గుర్తు తెలియని ఉద్యోగులు సీఈవో సలీల్ పారెఖ్, సీఎఫ్ వో నీలాంజన్ రాయ్ లపై ఫిర్యాదు చేస్తూ బోర్డుకు లేఖలు రాశారు. కంపెనీ లాభాలను పెంచి చూపేందుకు వీరు అకౌంటింగ్ లో అనైతిక చర్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. వీరి ఫిర్యాదులను ఆడిట్ కమిటీ ముందు పెడతామని బోర్డు ప్రకటించింది.

నందన్ నీలేకని వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి...

* కంపెనీ బోర్డు సభ్యుడొకరు 30 సెప్టెంబర్ 2019న రెండు ఫిర్యాదులను అందుకున్నారు.   20 సెప్టెంబర్ 2019 అని తేదీ రాసి ఉన్న లేఖలో  ‘అనైతిక చర్యలతో కంపెనీకి హాని’ అని టైటిల్ ఉండగా, రెండో లేఖలో తేదీని పేర్కొనలేదు. టైటిల్ ‘ విజిల్ బ్లోయర్ ఫిర్యాదు’ అని ఉంది.

* విజిల్ బ్లోయర్ (ప్రజావేగు) ఫిర్యాదులపై స్పందనగా  అక్టోబర్ 10, 2019 న వాటిని ఆడిట్ కమిటీ ముందు పెట్టాము. అక్టోబర్ 11న నాన్ ఎగ్జిక్యూటివ్ సభ్యులతో కూడిన బోర్డుకు సమర్పించారు.

* ఈ ఫిర్యాదులను ఒక్కో అంశంగా తీసుకొని విచారణ చేస్తాము. విచారణ నిష్పక్షపాతంగా సాగుతుంది. తేదీ పేర్కొనని ఫిర్యాది లేఖలో సీఈవోపై ఫిర్యాదులున్నాయి. ఆయన అమెరికా, ముంబైలకు జరిపిన ప్రయాణాలపై ఆరోపణలున్నాయి.

* అక్టోబర్ 3, 2019న ఫిర్యాదుదారులు లేఖను విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ ప్రొగ్రామ్, వాషింగ్టన్ డి.సికి రాసినట్టు మాకు అక్టోబర్ 16న తెలిసింది.

* ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదులకు సంబంధించి వాయిస్ రికార్డింగ్ లు, ఇతర సాక్ష్యాలు పంపలేదు. అయినప్పటికి వీరి ఆరోపణలపై మేము పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నాము.

* ఆడిట్ కమిటీకి తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్11నే అది విచారణ ప్రారంభించింది.  స్వతంత్ర అంతర్గత ఆడిటర్స్ ( ఎర్నెస్ట్ అండ్ యంగ్ ) తో సంప్రదింపులు ప్రారంభించింది. కంపెనీకి చెందిన లీగల్ వ్యవహారాలను షార్దూల్ అమర్ చంద్ మంగల్ దాస్ అండ్ కో స్వంతంత్రంగా చూసుకుంటుంది.   

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...