Skip to main content

చిదంబరం, డీకే శివకుమార్ ల బెయిల్ రద్దు చేయాలి: సుప్రీంకోర్టులో సీబీఐ, ఈడీ పిటిషన్లు



 ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరానికి ఇటీవల సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, మనీ లాండరింగ్‌ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత డీకే శివకుమార్.. ఢిల్లీ హైకోర్టు నుంచి షరతులతో కూడిన బెయిల్ పొందారు. అయితే, వీరిద్దరి బెయిల్ లను రద్దు చేయాలని ఈ రోజు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.

చిదంబరం, డీకే శివకుమార్ ల బెయిల్ లను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో సీబీఐ, ఈడీ విడివిడిగా పిటిషన్ లు దాఖలు చేశాయి. కాగా, ఇటీవల రూ.లక్ష వ్యక్తిగత పూచి కత్తుపై సుప్రీంకోర్టు చిదంబరానికి బెయిల్‌ మంజూరు చేసినప్పటికీ ఆయన జైలునుంచి విముక్తి అయ్యే అవకాశం లేకుండాపోయింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసుకి సంబంధించిన ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఇప్పటికే అదుపులోకి తీసుకుంది.

మరోవైపు, ఈడీ విచారణలు ఎదుర్కొంటోన్న డీకే శివకుమార్‌ ఢిల్లీలోనే ఉంటున్నారు.  ఈ కేసులో తన తల్లి, భార్యకు ఈడీ జారీ చేసిన నోటీసుల నుంచి మినహాయింపు ఢిల్లీ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ల విచారణలు ఈ నెల 31కు వాయిదా పడ్డాయి. ఆయన నిన్న సాయంత్రం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసానికి వెళ్లారు. అలాగే, కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీని కూడా కలిసి కేసుల విషయమై చర్చించారు. అంతకు ముందు కూడా కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్‌, అహ్మద్‌పటేల్‌లతో చర్చించారు.    

Comments

Popular posts from this blog

ఆర్టీసీ విలీనం చేసి తీరుతాం: ఏపీ సర్కారుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని స్పందన

ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ విలీనంపై ఓ ప్రయోగం చేశారని, ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని స్పందించారు. విజయవాడ ఆర్టీసీ ఆసుపత్రిలో టీడీపీ ఎంపీ కేశినేని నాని నిర్మించిన వసతి భవనాన్ని పేర్ని నాని ప్రారంభించి మాట్లాడుతూ తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై స్పందించారు. తెలంగాణ ఆర్టీసీలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నామని, దేశంలో చాలా వ్యవస్థలు ప్రైవేటు పరం అవుతున్న పరిస్థితుల్లో ఏపీలో మాత్రం ఒక కార్పొరేషన్ ను సర్కారులో విలీనం చేయడమనేది గొప్ప విషయమని పేర్ని నాని అన్నారు. తెలంగాణలో జరుగుతోన్న ఆర్టీసీ సమ్మెపై ఇటీవల కేసీఆర్ మాట్లాడుతూ ఏపీలో ఏం జరుగుతుందో ఆరు నెలల్లో చూద్దామని అన్నారని, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో తమ ప్రభుత్వంలో కసి పెరిగిందని తెలిపారు. జగన్ తీసుకున్న నిర్ణయం మేరకు ఆర్టీసీ కార్మికులను విలీనం చేస్తామని ప్రకటన చేశామని, దాన్ని అమలు చేసి తీరాలన్న పట్టుదల పెరిగిందని పేర్ని నాని అన్నారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యను తాము పాజిటివ్ గా తీసుకున్నామని చెప్పారు. కొన్ని నెలల్ల...

ఆ జీవో రద్దు చేయడం దారుణం: అయ్యన్నపాత్రుడు

రైతు రుణమాఫీకి ఇచ్చిన జీవోను రద్దు చేయడం దారుణమని, ఏ ప్రభుత్వం ఉన్న నడుస్తున్న పథకాలను కొనసాగించాలని టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. జగన్ ప్రభుత్వం నిన్న రద్దు చేసిన జీవో 38పై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మీద కోపంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబుకు అసలు వ్యవసాయం పట్ల అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. తమ హయాంలో మొత్తం 14,124 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. వంద రోజుల తర్వాత కూడా చంద్రబాబు పాలన గురించి మాట్లాడుతున్నారని.. అసలు వైసీపీ పాలన ఏంటో చెప్పాలని అయ్యన్న డిమాండ్ చేశారు.  ప్రభుత్వం లోపాలను ఎత్తి చూపిస్తే ప్రతిపక్షం విమర్శలు చేస్తోందని అంటూ.. వైసీపీ నేతలు తిరిగి విమర్శలు చేస్తున్నారని అయ్యన్న మండిపడ్దారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే నాలుకలు, పీకలు కోస్తామని బెదిరిస్తున్నారని, వారి బెదిరింపులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలకు కోపం వస్తే గొంతు పిసికి చంపేస్తారన్నారు. వైసీపీ నేతలు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని అయ్యన్న హెచ్చరించారు. అవంతి శ్రీనివాస్ మంచి వ్యక్తి, ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్...