Skip to main content

మోదీగారూ...దక్షిణాదిలో కళాకారులే లేరా : మెగాస్టార్‌ చిరంజీవి కోడలు ఉపాసన సంచలన ట్వీట్‌


 

మెగాస్టార్‌ చిరంజీవి కోడలు కొణిదెల ఉపాసన ‘ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ’ సంచలన ట్వీట్‌తో సినీవర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరతీశారు. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే రామ్‌చరణ్‌ సతీమణి ట్విట్టర్‌లో చేసిన ఈ కామెంట్‌ వైరల్‌గా మారింది. మహాత్మాగాంధీ 150 జయంత్యుత్సవాల సందర్భంగా భేటీకి ఉత్తరాదికి చెందిన హిందీ కళాకారులను మాత్రమే మోదీ ఆహ్వానించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని లోక కళ్యాణ్‌ మార్గ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి షారూక్‌ఖాన్‌, అమీర్‌ఖాన్‌, కంగనా రనౌత్‌, జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌ సహా టెలివిజన్‌, సినీరంగాలకు చెంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ విషయాన్ని మోదీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన ఉపాసన `మోదీగారు.. దక్షిణాది వారమైన మేము కూడా ప్రధానిగా మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం. కళాకారులతో జరిగిన సమావేశాన్ని మీరు మాత్రం  కేవలం హిందీ నటీనటులకే పరిమితం చేశారు. దక్షిణాది కళాకారులను పట్టించుకోకపోవడం బాధగా ఉంది` అంటూ ట్వీట్ చేశారు.

ఇంతవరకు ఏ వివాదంలోనూ కనిపించని ఉపాసన ఏకంగా ప్రధానిని ఉద్దేశిస్తూ  చేసిన ట్వీట్‌ సంచలనంగా మారింది. ఈ ట్వీట్‌కు సినీ అభిమానులతో పాటు సామాన్యుల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. దక్షిణాది వారంటే ఉత్తరాది వారికి ఎప్పుడూ చిన్నచూపే అని పలువురు నెటిజన్లు ఉపాసనకు మద్దతుగా నిలిచారు.   

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...