Skip to main content

మోదీగారూ...దక్షిణాదిలో కళాకారులే లేరా : మెగాస్టార్‌ చిరంజీవి కోడలు ఉపాసన సంచలన ట్వీట్‌


 

మెగాస్టార్‌ చిరంజీవి కోడలు కొణిదెల ఉపాసన ‘ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ’ సంచలన ట్వీట్‌తో సినీవర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరతీశారు. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే రామ్‌చరణ్‌ సతీమణి ట్విట్టర్‌లో చేసిన ఈ కామెంట్‌ వైరల్‌గా మారింది. మహాత్మాగాంధీ 150 జయంత్యుత్సవాల సందర్భంగా భేటీకి ఉత్తరాదికి చెందిన హిందీ కళాకారులను మాత్రమే మోదీ ఆహ్వానించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని లోక కళ్యాణ్‌ మార్గ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి షారూక్‌ఖాన్‌, అమీర్‌ఖాన్‌, కంగనా రనౌత్‌, జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌ సహా టెలివిజన్‌, సినీరంగాలకు చెంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ విషయాన్ని మోదీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన ఉపాసన `మోదీగారు.. దక్షిణాది వారమైన మేము కూడా ప్రధానిగా మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం. కళాకారులతో జరిగిన సమావేశాన్ని మీరు మాత్రం  కేవలం హిందీ నటీనటులకే పరిమితం చేశారు. దక్షిణాది కళాకారులను పట్టించుకోకపోవడం బాధగా ఉంది` అంటూ ట్వీట్ చేశారు.

ఇంతవరకు ఏ వివాదంలోనూ కనిపించని ఉపాసన ఏకంగా ప్రధానిని ఉద్దేశిస్తూ  చేసిన ట్వీట్‌ సంచలనంగా మారింది. ఈ ట్వీట్‌కు సినీ అభిమానులతో పాటు సామాన్యుల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. దక్షిణాది వారంటే ఉత్తరాది వారికి ఎప్పుడూ చిన్నచూపే అని పలువురు నెటిజన్లు ఉపాసనకు మద్దతుగా నిలిచారు.   

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.