Skip to main content

మోదీగారూ...దక్షిణాదిలో కళాకారులే లేరా : మెగాస్టార్‌ చిరంజీవి కోడలు ఉపాసన సంచలన ట్వీట్‌


 

మెగాస్టార్‌ చిరంజీవి కోడలు కొణిదెల ఉపాసన ‘ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ’ సంచలన ట్వీట్‌తో సినీవర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరతీశారు. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే రామ్‌చరణ్‌ సతీమణి ట్విట్టర్‌లో చేసిన ఈ కామెంట్‌ వైరల్‌గా మారింది. మహాత్మాగాంధీ 150 జయంత్యుత్సవాల సందర్భంగా భేటీకి ఉత్తరాదికి చెందిన హిందీ కళాకారులను మాత్రమే మోదీ ఆహ్వానించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని లోక కళ్యాణ్‌ మార్గ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి షారూక్‌ఖాన్‌, అమీర్‌ఖాన్‌, కంగనా రనౌత్‌, జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌ సహా టెలివిజన్‌, సినీరంగాలకు చెంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ విషయాన్ని మోదీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన ఉపాసన `మోదీగారు.. దక్షిణాది వారమైన మేము కూడా ప్రధానిగా మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం. కళాకారులతో జరిగిన సమావేశాన్ని మీరు మాత్రం  కేవలం హిందీ నటీనటులకే పరిమితం చేశారు. దక్షిణాది కళాకారులను పట్టించుకోకపోవడం బాధగా ఉంది` అంటూ ట్వీట్ చేశారు.

ఇంతవరకు ఏ వివాదంలోనూ కనిపించని ఉపాసన ఏకంగా ప్రధానిని ఉద్దేశిస్తూ  చేసిన ట్వీట్‌ సంచలనంగా మారింది. ఈ ట్వీట్‌కు సినీ అభిమానులతో పాటు సామాన్యుల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. దక్షిణాది వారంటే ఉత్తరాది వారికి ఎప్పుడూ చిన్నచూపే అని పలువురు నెటిజన్లు ఉపాసనకు మద్దతుగా నిలిచారు.   

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...