Skip to main content

మాజీ ఎంపీ హర్షకుమార్‌ను అరెస్ట్ చేసేందుకు నాలుగు బృందాలు: ఏలూరు రేంజ్‌ డీఐజీ ఖాన్‌

చట్టవ్యతిరేకంగా వ్యవహరించి తప్పించుకు తిరుగుతున్న అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ను అరెస్ట్ చేసేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని, ఏ క్షణమైనా ఆయనని అరెస్టు చేస్తామని ఏలూరు రేంజ్‌ డీఐజీ ఎ.ఎస్‌.ఖాన్‌ తెలిపారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించడం, న్యాయమూర్తులను పరుష పదజాలంతో దూషించడం, మహిళా ఉద్యోగినుల పట్ల అసభ్యకరంగా వ్యవహరించడం వంటి పలు కేసులు ఆయనపై ఉన్నాయని చెప్పారు.

ఇటీవల రాజమహేంద్రవరం కోర్టు స్థలంలో ఆక్రమణలు తొలగిస్తుండగా హర్షకుమార్‌ ఘటనా స్థలికి వచ్చి జిల్లా న్యాయమూర్తిని పరుష పదజాలంతో దూషించారని, అక్కడ ఉన్న కోర్టు ఉద్యోగులను బెదిరించారని తెలిపారు. అక్కడి మహిళా ఉద్యోగినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారన్నారు. దీనిపై జిల్లా కోర్టు పరిపాలనాధికారి మూడో పట్టణ పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీఐజీ వివరించారు.

అలాగే, ఇటీవల గోదావరిలో బోటు మునిగిపోయిన ఘటనలో బోటులో 93 మంది ప్రయాణికులు ఉన్నారంటూ ప్రజల్ని, వ్యవస్థను తప్పుదోవ పట్టించారని తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయన వద్ద ఉన్న సమాచారం ఇస్తే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని నోటీసులు ఇచ్చినా స్పందించలేదన్నారు. అంటే తప్పుడు సమాచారం ఇచ్చి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేశారన్నారు.

ఈ కేసులపై హర్షకుమార్‌ను అరెస్టు చేసేందుకు వెళితే పరారయ్యారని, దీంతో ఆయన్ను పట్టుకునేందుకు నాలుగు బృందాలతో గాలిస్తున్నామని తెలిపారు. ధిక్కార ధోరణిలో మాట్లాడి ప్రజలను తప్పుదోవపట్టించే వారు ఎంతటి వారైనా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని డీఐజీ ఖాన్‌ స్పష్టం చేశారు.

Comments

Popular posts from this blog

బలపరీక్ష ఎప్పుడు నిర్వహించినా సిద్ధం.. తమ ఎమ్మెల్యేలను హోటళ్లకు తరలించిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను ముంబయిలోని పలు లగ్జరీ హోటళ్లకు తరలించాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు ఆ పార్టీల అగ్రనేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసెంబ్లీలో బీజేపీ బలనిరూపణ ఏ రోజు జరిగినా దానికి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలని ఆ మూడు పార్టీలు భావిస్తున్నాయి. ముంబయిలోని పోవైలో ఉన్న ఓ హోటల్ కు నిన్న రాత్రే ఎన్సీపీ ఎమ్మెల్యేలు బస్సుల్లో చేరుకున్నారు. శివసేన నుంచి 56 మంది నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన విషయం తెలిసిందే. వారిలో 55 మంది  అధేరీలో ఉన్న ఓ హోటల్ లో ఉన్నారు. అలాగే, వారి నుంచి ఆ పార్టీ అధిష్ఠానం సెల్ ఫోన్ లను తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ తమ 44 మంది ఎమ్మెల్యేలను మరో హోటల్ కి తరలించింది. అలాగే, శివసేన ఎమ్మెల్యేలు ఉన్న హోటల్ లోనే ఎనిమిది మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ పటేల్ మీడియాకు చెప్పారు. 

రామమందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారు: బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారయ్యిందన్నట్లు మాట్లాడి ఓ బీజేపీ ఎమ్మెల్యే సంచలనానికి తెరతీశారు. నవంబరు 18వ తేదీన నిర్మాణం ప్రారంభమవుతుందంటూ డేట్‌ కూడా ఫిక్స్‌ చేసేశారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో వుంది. రామాలయ నిర్మాణం విషయంలో శుభవార్త వింటారని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ రెండు రోజుల క్రితమే వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే...రాజస్థాన్‌ రాష్ట్రం పాలి జిల్లా కేంద్రంలో జరిగిన రాంలీలా కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే గైన్‌చంద్‌ పరఖ్‌ మాట్లాడారు. సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న రామజన్మభూమి కేసు నవంబరు 17వ తేదీ నాటికి కొలిక్కి వస్తుందని, 18వ తేదీన రామమందిర నిర్మాణం మొదలవుతుందని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ సాగుతోంది.