Skip to main content

మహారాష్ట్ర, హరియాణాలో కమలం జోరు

మహారాష్ట్ర, హరియాణాలో కమలం జోరు
 మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ హవా కొనసాగుతోంది. మహారాష్ట్రలో 142 చోట్ల భాజపా ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్‌ 87, ఇతరులు 30 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇక హరియాణాలో భాజపా 40 చోట్ల ఆధిక్యంలో దూసుకెళ్తోంది. కాంగ్రెస్‌ 23, జననాయక్‌ జనతా పార్టీ 11, ఇతరులు 9 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. 
హరియాణాలోని కైతాల్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రణ్‌దీప్‌సింగ్‌ సుర్జేవాలా వెనుకంజలో ఉన్నారు. హరియాణా దాద్రి నుంచి పోటీ చేస్తున్న రెజ్లర్‌ బబితా ఫొగట్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహారాష్ట్రలోని వర్లీ నియోజకవర్గంలో శివసేన యువ నేత ఆదిత్య ఠాక్రే ముందంజలో ఉన్నారు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...