Skip to main content

ఇన్ఫోసిస్ లో సత్యం తరహా స్కామ్... ఉద్యోగుల లేఖతో కుప్పకూలిన ఈక్విటీ విలువ!

 

వస్తున్న ఆదాయాన్ని ఎక్కువగా చూపుతూ, లాభాలను తక్కువగా చూపుతున్నారంటూ, ఓ సంఘంగా ఏర్పడిన ఇన్ఫోసిస్ ఉద్యోగులు బహిరంగ లేఖను రాయడం కార్పొరేట్ వర్గాల్లో, ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీలో తీవ్ర ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇన్ఫీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలిల్ పరేఖ్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిలంజన్ రాయ్ లు అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారని, వీరు ఆడిటర్లను కూడా మేనేజ్ చేశారని కొందరు ఉద్యోగులు తమ లేఖలో పేర్కొన్నారు.

దీని ఫలితంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినగా, 2013 తరువాత ఇన్ఫీ ఈక్విటీ విలువ భారీగా నష్టపోయింది. ఈ ఉదయం ట్రేడింగ్ సెషన్ ప్రారంభమైన తరువాత 16 శాతానికి పైగా నష్టపోయిన ఈక్విటీ వాల్యూ, ప్రస్తుతం 14.13 శాతం నష్టంతో రూ. 660 వద్ద కొనసాగుతోంది. దీని ప్రభావం ఇతర ఐటీ కంపెనీలపైనా పడింది.

కాగా, దాదాపు పదేళ్ల క్రితం హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న సత్యం కంప్యూటర్స్ లోనూ ఇదే తరహా స్కామ్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ కుంభకోణం తీవ్ర కలకలం రేపగా, ఆపై జరిగిన పరిణామాలతో, సత్యం కంప్యూటర్స్ టెక్ మహీంద్రాలో విలీనమైంది.

ఇదిలావుండగా, ఉదయం 12.20 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక క్రితం ముగింపుతో పోలిస్తే 60 పాయింట్ల లాభంతో 39,358 వద్ద కొనసాగుతుండగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచిక 27 పాయింట్ల లాభంతో 11,689 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. యస్ బ్యాంక్, ఐసీఐసీఐ, భారతీ ఎయిర్ టెల్, గ్రాసిమ్ తదితర కంపెనీలు లాభాల్లోనూ, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా తదితర కంపెనీలు నష్టాల్లోనూ నడుస్తున్నాయి.   

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.