Skip to main content

ఇన్ఫోసిస్ లో సత్యం తరహా స్కామ్... ఉద్యోగుల లేఖతో కుప్పకూలిన ఈక్విటీ విలువ!

 

వస్తున్న ఆదాయాన్ని ఎక్కువగా చూపుతూ, లాభాలను తక్కువగా చూపుతున్నారంటూ, ఓ సంఘంగా ఏర్పడిన ఇన్ఫోసిస్ ఉద్యోగులు బహిరంగ లేఖను రాయడం కార్పొరేట్ వర్గాల్లో, ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీలో తీవ్ర ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇన్ఫీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలిల్ పరేఖ్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిలంజన్ రాయ్ లు అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారని, వీరు ఆడిటర్లను కూడా మేనేజ్ చేశారని కొందరు ఉద్యోగులు తమ లేఖలో పేర్కొన్నారు.

దీని ఫలితంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినగా, 2013 తరువాత ఇన్ఫీ ఈక్విటీ విలువ భారీగా నష్టపోయింది. ఈ ఉదయం ట్రేడింగ్ సెషన్ ప్రారంభమైన తరువాత 16 శాతానికి పైగా నష్టపోయిన ఈక్విటీ వాల్యూ, ప్రస్తుతం 14.13 శాతం నష్టంతో రూ. 660 వద్ద కొనసాగుతోంది. దీని ప్రభావం ఇతర ఐటీ కంపెనీలపైనా పడింది.

కాగా, దాదాపు పదేళ్ల క్రితం హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న సత్యం కంప్యూటర్స్ లోనూ ఇదే తరహా స్కామ్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ కుంభకోణం తీవ్ర కలకలం రేపగా, ఆపై జరిగిన పరిణామాలతో, సత్యం కంప్యూటర్స్ టెక్ మహీంద్రాలో విలీనమైంది.

ఇదిలావుండగా, ఉదయం 12.20 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక క్రితం ముగింపుతో పోలిస్తే 60 పాయింట్ల లాభంతో 39,358 వద్ద కొనసాగుతుండగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచిక 27 పాయింట్ల లాభంతో 11,689 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. యస్ బ్యాంక్, ఐసీఐసీఐ, భారతీ ఎయిర్ టెల్, గ్రాసిమ్ తదితర కంపెనీలు లాభాల్లోనూ, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా తదితర కంపెనీలు నష్టాల్లోనూ నడుస్తున్నాయి.   

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.