Skip to main content

ఇన్ఫోసిస్ లో సత్యం తరహా స్కామ్... ఉద్యోగుల లేఖతో కుప్పకూలిన ఈక్విటీ విలువ!

 

వస్తున్న ఆదాయాన్ని ఎక్కువగా చూపుతూ, లాభాలను తక్కువగా చూపుతున్నారంటూ, ఓ సంఘంగా ఏర్పడిన ఇన్ఫోసిస్ ఉద్యోగులు బహిరంగ లేఖను రాయడం కార్పొరేట్ వర్గాల్లో, ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీలో తీవ్ర ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇన్ఫీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలిల్ పరేఖ్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిలంజన్ రాయ్ లు అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారని, వీరు ఆడిటర్లను కూడా మేనేజ్ చేశారని కొందరు ఉద్యోగులు తమ లేఖలో పేర్కొన్నారు.

దీని ఫలితంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినగా, 2013 తరువాత ఇన్ఫీ ఈక్విటీ విలువ భారీగా నష్టపోయింది. ఈ ఉదయం ట్రేడింగ్ సెషన్ ప్రారంభమైన తరువాత 16 శాతానికి పైగా నష్టపోయిన ఈక్విటీ వాల్యూ, ప్రస్తుతం 14.13 శాతం నష్టంతో రూ. 660 వద్ద కొనసాగుతోంది. దీని ప్రభావం ఇతర ఐటీ కంపెనీలపైనా పడింది.

కాగా, దాదాపు పదేళ్ల క్రితం హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న సత్యం కంప్యూటర్స్ లోనూ ఇదే తరహా స్కామ్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ కుంభకోణం తీవ్ర కలకలం రేపగా, ఆపై జరిగిన పరిణామాలతో, సత్యం కంప్యూటర్స్ టెక్ మహీంద్రాలో విలీనమైంది.

ఇదిలావుండగా, ఉదయం 12.20 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక క్రితం ముగింపుతో పోలిస్తే 60 పాయింట్ల లాభంతో 39,358 వద్ద కొనసాగుతుండగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచిక 27 పాయింట్ల లాభంతో 11,689 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. యస్ బ్యాంక్, ఐసీఐసీఐ, భారతీ ఎయిర్ టెల్, గ్రాసిమ్ తదితర కంపెనీలు లాభాల్లోనూ, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా తదితర కంపెనీలు నష్టాల్లోనూ నడుస్తున్నాయి.   

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...