Skip to main content

బీఎస్ ఎన్ ఎల్, ఎంటీఎన్ ఎల్ విలీనానికి కేంద్రం ఓకే

 

నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలు బీఎస్ ఎన్ ఎల్, ఎంటీఎన్ ఎల్ విలీనానికి కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ సంస్థలను మూసివేసే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈరోజు మీడియాకు వెల్లడించారు. వీటి నుంచి పెట్టుబడులను ప్రభుత్వం ఉపసంహరించబోవడం లేదని క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రభుత్వం ఈ రెండు సంస్థలకు రూ.29,937 కోట్ల రివైవల్ ప్యాకేజీని అందిస్తుందని వివరించారు. 4జీ స్పెక్ట్రంను ఈ రెండు సంస్థలకు కేటాయించాలని, ఉద్యోగులకు ఆకర్షణీయమైన వీఆర్ ఎస్ ప్యాకేజీని ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించిందన్నారు. 

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...