Skip to main content

ఆ వీడియోలో ఏంటీ దారుణం ... మోదీని ప్రశ్నిస్తూ రష్మీగౌతమ్ భావోద్వేగం

Image result for rashmi jabardasth



గుజరాత్‌కు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరుతపులి పిల్లను పట్టుకుని కొందరు యువకులు దాన్ని హింసిస్తున్నారు. గతంలో సింహాలను పట్టుకుని ఇలాగే కొందరు హింసించారు. ఈ ఘటనలపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.దీనిపై ప్రధాని నరేంద్ర మోదీని జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ ట్విట్టర్లో ప్రశ్నించారు. "గుజరాత్ లో ఏమి జరుగుతుంది , మనకు డిజిటల్ ఇండియా, మోడర్న్ ఇండియాతో పాటు సెన్సిబుల్ ఇండియా కూడా కావాలి .. నాకు ఈ వీడియో పూర్తిగా చూడాలన్న కూడా బాధ, భయం రెండూ వేశాయి అంటూ భావోద్వేగానికి లోనవుతూ ఆమె ట్విట్టర్ లో ట్వీట్ చేసారు. రష్మీ గౌతమ్ చేసిన ఈ ట్వీట్‌కు అమె అభిమానులు అంతా లైకులు కొడుతున్నారు. రష్మీకి జంతువుల పట్ల ఎంత ప్రేమ అంటూ చర్చించుకుంటున్నారు. మరోవైపు ప్రధానిని ప్రశ్నించిన రష్మీ ధైర్యాన్ని ఇంకొందరు మెచ్చుకుంటున్నారు. మరీ రష్మీ ట్వీట్‌కు పీఎం మోదీ స్పందిస్తారో లేదో చూడాలి.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.