Skip to main content

ఆ వీడియోలో ఏంటీ దారుణం ... మోదీని ప్రశ్నిస్తూ రష్మీగౌతమ్ భావోద్వేగం

Image result for rashmi jabardasth



గుజరాత్‌కు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరుతపులి పిల్లను పట్టుకుని కొందరు యువకులు దాన్ని హింసిస్తున్నారు. గతంలో సింహాలను పట్టుకుని ఇలాగే కొందరు హింసించారు. ఈ ఘటనలపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.దీనిపై ప్రధాని నరేంద్ర మోదీని జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ ట్విట్టర్లో ప్రశ్నించారు. "గుజరాత్ లో ఏమి జరుగుతుంది , మనకు డిజిటల్ ఇండియా, మోడర్న్ ఇండియాతో పాటు సెన్సిబుల్ ఇండియా కూడా కావాలి .. నాకు ఈ వీడియో పూర్తిగా చూడాలన్న కూడా బాధ, భయం రెండూ వేశాయి అంటూ భావోద్వేగానికి లోనవుతూ ఆమె ట్విట్టర్ లో ట్వీట్ చేసారు. రష్మీ గౌతమ్ చేసిన ఈ ట్వీట్‌కు అమె అభిమానులు అంతా లైకులు కొడుతున్నారు. రష్మీకి జంతువుల పట్ల ఎంత ప్రేమ అంటూ చర్చించుకుంటున్నారు. మరోవైపు ప్రధానిని ప్రశ్నించిన రష్మీ ధైర్యాన్ని ఇంకొందరు మెచ్చుకుంటున్నారు. మరీ రష్మీ ట్వీట్‌కు పీఎం మోదీ స్పందిస్తారో లేదో చూడాలి.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...