Skip to main content

ఆ వీడియోలో ఏంటీ దారుణం ... మోదీని ప్రశ్నిస్తూ రష్మీగౌతమ్ భావోద్వేగం

Image result for rashmi jabardasth



గుజరాత్‌కు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరుతపులి పిల్లను పట్టుకుని కొందరు యువకులు దాన్ని హింసిస్తున్నారు. గతంలో సింహాలను పట్టుకుని ఇలాగే కొందరు హింసించారు. ఈ ఘటనలపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.దీనిపై ప్రధాని నరేంద్ర మోదీని జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ ట్విట్టర్లో ప్రశ్నించారు. "గుజరాత్ లో ఏమి జరుగుతుంది , మనకు డిజిటల్ ఇండియా, మోడర్న్ ఇండియాతో పాటు సెన్సిబుల్ ఇండియా కూడా కావాలి .. నాకు ఈ వీడియో పూర్తిగా చూడాలన్న కూడా బాధ, భయం రెండూ వేశాయి అంటూ భావోద్వేగానికి లోనవుతూ ఆమె ట్విట్టర్ లో ట్వీట్ చేసారు. రష్మీ గౌతమ్ చేసిన ఈ ట్వీట్‌కు అమె అభిమానులు అంతా లైకులు కొడుతున్నారు. రష్మీకి జంతువుల పట్ల ఎంత ప్రేమ అంటూ చర్చించుకుంటున్నారు. మరోవైపు ప్రధానిని ప్రశ్నించిన రష్మీ ధైర్యాన్ని ఇంకొందరు మెచ్చుకుంటున్నారు. మరీ రష్మీ ట్వీట్‌కు పీఎం మోదీ స్పందిస్తారో లేదో చూడాలి.

Comments

Popular posts from this blog

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.