Skip to main content

ఆ వీడియోలో ఏంటీ దారుణం ... మోదీని ప్రశ్నిస్తూ రష్మీగౌతమ్ భావోద్వేగం

Image result for rashmi jabardasth



గుజరాత్‌కు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరుతపులి పిల్లను పట్టుకుని కొందరు యువకులు దాన్ని హింసిస్తున్నారు. గతంలో సింహాలను పట్టుకుని ఇలాగే కొందరు హింసించారు. ఈ ఘటనలపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.దీనిపై ప్రధాని నరేంద్ర మోదీని జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ ట్విట్టర్లో ప్రశ్నించారు. "గుజరాత్ లో ఏమి జరుగుతుంది , మనకు డిజిటల్ ఇండియా, మోడర్న్ ఇండియాతో పాటు సెన్సిబుల్ ఇండియా కూడా కావాలి .. నాకు ఈ వీడియో పూర్తిగా చూడాలన్న కూడా బాధ, భయం రెండూ వేశాయి అంటూ భావోద్వేగానికి లోనవుతూ ఆమె ట్విట్టర్ లో ట్వీట్ చేసారు. రష్మీ గౌతమ్ చేసిన ఈ ట్వీట్‌కు అమె అభిమానులు అంతా లైకులు కొడుతున్నారు. రష్మీకి జంతువుల పట్ల ఎంత ప్రేమ అంటూ చర్చించుకుంటున్నారు. మరోవైపు ప్రధానిని ప్రశ్నించిన రష్మీ ధైర్యాన్ని ఇంకొందరు మెచ్చుకుంటున్నారు. మరీ రష్మీ ట్వీట్‌కు పీఎం మోదీ స్పందిస్తారో లేదో చూడాలి.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...