Skip to main content

ఆర్టీసీ చర్చలు విఫలం.. సమ్మె తప్పదన్న

తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలతో గురువారం జరిగిన మలిదశ చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో శనివారం నుంచి సమ్మె తప్పదని ఆర్టీసీ కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఫలితంగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు ప్రారంభించింది. మరోవైపు, సమ్మెకు వెళ్తే ‘ఎస్మా’ తప్పదని ప్రభుత్వం హెచ్చరించింది. అయితే, ఇటువంటి వాటికి తాము భయపడబోమని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి.

కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె కనుక కొనసాగితే, ప్రత్యామ్నాయంగా ఆరేడు వేల బస్సుల్ని నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది. రైల్వే శాఖ అదనపు రైళ్లు నడుపుతున్నా అవి సరిపోవన్నది ప్రభుత్వం యోచన. ప్రస్తుతం ఆర్టీసీలో తిరుగుతున్న 2100 అద్దె బస్సుల్ని యథాతథంగా నడపడంతోపాటు మరో 2 వేల బస్సులకు రోజువారీ పర్మిట్లు ఇచ్చి నడపాలని అధికారులు నిర్ణయించారు. అలాగే, ప్రస్తుతం విద్యాసంస్థలకు దసరా సెలవులు కావడంతో ఆ బస్సులను కూడా వినియోగించుకోవాలని భావిస్తున్నారు.
 
పండుగ సమయాల్లో నగరంలో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి సిటీ బస్సులను కూడా దూర ప్రాంతాలకు కేటాయించాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. ప్రైవేటు, విద్యాసంస్థల బస్సులను సమీకరించే బాధ్యతను ప్రభుత్వం రవాణా శాఖకు అప్పగించింది. అలాగే, ఇప్పటికే టికెట్ బుక్ చేసుకున్న వారికి ప్రత్యామ్నాయ బస్సులు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు, చర్చలు కొలిక్కి రాకపోవడంతో పండుగ ప్రయాణాలకు సిద్ధమవుతున్న నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...