Skip to main content

ఆర్టీసీ చర్చలు విఫలం.. సమ్మె తప్పదన్న

తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలతో గురువారం జరిగిన మలిదశ చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో శనివారం నుంచి సమ్మె తప్పదని ఆర్టీసీ కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఫలితంగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు ప్రారంభించింది. మరోవైపు, సమ్మెకు వెళ్తే ‘ఎస్మా’ తప్పదని ప్రభుత్వం హెచ్చరించింది. అయితే, ఇటువంటి వాటికి తాము భయపడబోమని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి.

కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె కనుక కొనసాగితే, ప్రత్యామ్నాయంగా ఆరేడు వేల బస్సుల్ని నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది. రైల్వే శాఖ అదనపు రైళ్లు నడుపుతున్నా అవి సరిపోవన్నది ప్రభుత్వం యోచన. ప్రస్తుతం ఆర్టీసీలో తిరుగుతున్న 2100 అద్దె బస్సుల్ని యథాతథంగా నడపడంతోపాటు మరో 2 వేల బస్సులకు రోజువారీ పర్మిట్లు ఇచ్చి నడపాలని అధికారులు నిర్ణయించారు. అలాగే, ప్రస్తుతం విద్యాసంస్థలకు దసరా సెలవులు కావడంతో ఆ బస్సులను కూడా వినియోగించుకోవాలని భావిస్తున్నారు.
 
పండుగ సమయాల్లో నగరంలో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి సిటీ బస్సులను కూడా దూర ప్రాంతాలకు కేటాయించాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. ప్రైవేటు, విద్యాసంస్థల బస్సులను సమీకరించే బాధ్యతను ప్రభుత్వం రవాణా శాఖకు అప్పగించింది. అలాగే, ఇప్పటికే టికెట్ బుక్ చేసుకున్న వారికి ప్రత్యామ్నాయ బస్సులు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు, చర్చలు కొలిక్కి రాకపోవడంతో పండుగ ప్రయాణాలకు సిద్ధమవుతున్న నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...