Skip to main content

నవాజ్ షరీఫ్ ఆరోగ్యం అత్యంత విషమం... డిశ్చార్జ్ చేసేందుకు వైద్యుల నిరాకరణ!



పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోగ్యం మరింతగా విషమించిందని ఆయనకు వైద్యం చేస్తున్న డాక్టర్లు వెల్లడించారు. ఆయన గుండెనొప్పితో బాధపడుతున్నారని, రక్తంలో ప్లేట్ లెట్స్ కౌంట్ కనిష్ఠానికి పడిపోయిందని, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టేనని అంటున్నారు.

ప్రస్తుతం 69 ఏళ్ల వయసులో ఉన్న నవాజ్ షరీఫ్ రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య ఒక్కరోజులోనే 45 వేల నుంచి 25 వేలకు పడిపోయాయని తెలుస్తోంది. ఆయన తీవ్ర అనారోగ్యం బారిన పడటంతో నిన్న రాత్రి సర్వీసెస్ హాస్పిటల్ కు తరలించారు. ఆయన పరిస్థితి కుదుటపడేంత వరకూ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయలేమని జైలు అధికారులకు వైద్యులు స్పష్టం చేశారు. ఇటీవల ఆయన గుండెకు రక్త ప్రసరణ సరిగ్గా జరుగని కారణంగా స్వల్ప గుండెపోటుకు కూడా గురయ్యారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...