Skip to main content

ఆదిత్య థాకరే గెలుపు ఖాయం: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్


మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముంబై ‘వర్లీ’ నియోజకవర్గం నుంచి శివసేన తరఫున బరిలోకి దిగుతున్న దివంగత బాల్ థాకరే మనవడు ఆదిత్య థాకరేకు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఒక వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. శివసేన పార్టీ యువ విభాగమైన ‘యువసేన’ చీఫ్  29 ఏళ్ల  ఆదిత్య థాకరే భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని సంజయ్ దత్ పేర్కొన్నారు.

అదిత్య థాకరే శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే పెద్ద కుమారుడు.  ‘ఆదిత్య నాకు చిన్న తమ్ముడు లాంటి వాడు. అతను ఉద్దండ నేత బాలసాహెబ్ థాకరే వంశం నుంచి వస్తున్నాడు. బాలాసాహెబ్ నాకు తండ్రి లాంటి వారు. అతను నన్ను, నా కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించారు. ఆయన్ని నేను ఎప్పటికీ మరిచిపోను. ఉద్దవ్ బాయ్ కూడా అంతే ప్రేమతో మమ్మల్ని అభిమానిస్తాడు’ అని 60 ఏళ్ల సంజయ్ పేర్కొన్నాడు.

  ‘ఆదిత్య గెలవాలని నేను కోరుకుంటున్నా. అదే జరుగుతుంది.  మనదేశానికి ధైర్యమున్న యువ నేతల అవసరముంది. జై హింద్, జై మహారాష్ట్ర’  అని సంజయ్ ట్వీట్ చేశారు.

తొలిసారిగా థాకరే కుటుంబం నుంచి..
1966 లో బాల్ థాకరే శివసేన స్థాపించిన నాటినుంచి ఇప్పటివరకు ఆ కుటుంబం నుంచి ఒక్కరు కూడా ఎన్నికల బరిలోకి దిగలేదు. రాజ్యాంగ బద్ధమైన పదవులను అధిష్ఠించలేదు. ఉద్దవ్ థాకరే కజిన్ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ ఎస్) చీఫ్ రాజ్ థాకరే 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోటీ చేస్తానని తొలుత ప్రకటించి అనంతరం విరమించుకున్నారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...