Skip to main content

ఆదిత్య థాకరే గెలుపు ఖాయం: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్


మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముంబై ‘వర్లీ’ నియోజకవర్గం నుంచి శివసేన తరఫున బరిలోకి దిగుతున్న దివంగత బాల్ థాకరే మనవడు ఆదిత్య థాకరేకు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఒక వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. శివసేన పార్టీ యువ విభాగమైన ‘యువసేన’ చీఫ్  29 ఏళ్ల  ఆదిత్య థాకరే భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని సంజయ్ దత్ పేర్కొన్నారు.

అదిత్య థాకరే శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే పెద్ద కుమారుడు.  ‘ఆదిత్య నాకు చిన్న తమ్ముడు లాంటి వాడు. అతను ఉద్దండ నేత బాలసాహెబ్ థాకరే వంశం నుంచి వస్తున్నాడు. బాలాసాహెబ్ నాకు తండ్రి లాంటి వారు. అతను నన్ను, నా కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించారు. ఆయన్ని నేను ఎప్పటికీ మరిచిపోను. ఉద్దవ్ బాయ్ కూడా అంతే ప్రేమతో మమ్మల్ని అభిమానిస్తాడు’ అని 60 ఏళ్ల సంజయ్ పేర్కొన్నాడు.

  ‘ఆదిత్య గెలవాలని నేను కోరుకుంటున్నా. అదే జరుగుతుంది.  మనదేశానికి ధైర్యమున్న యువ నేతల అవసరముంది. జై హింద్, జై మహారాష్ట్ర’  అని సంజయ్ ట్వీట్ చేశారు.

తొలిసారిగా థాకరే కుటుంబం నుంచి..
1966 లో బాల్ థాకరే శివసేన స్థాపించిన నాటినుంచి ఇప్పటివరకు ఆ కుటుంబం నుంచి ఒక్కరు కూడా ఎన్నికల బరిలోకి దిగలేదు. రాజ్యాంగ బద్ధమైన పదవులను అధిష్ఠించలేదు. ఉద్దవ్ థాకరే కజిన్ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ ఎస్) చీఫ్ రాజ్ థాకరే 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోటీ చేస్తానని తొలుత ప్రకటించి అనంతరం విరమించుకున్నారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.