Skip to main content

ఆదిత్య థాకరే గెలుపు ఖాయం: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్


మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముంబై ‘వర్లీ’ నియోజకవర్గం నుంచి శివసేన తరఫున బరిలోకి దిగుతున్న దివంగత బాల్ థాకరే మనవడు ఆదిత్య థాకరేకు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఒక వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. శివసేన పార్టీ యువ విభాగమైన ‘యువసేన’ చీఫ్  29 ఏళ్ల  ఆదిత్య థాకరే భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని సంజయ్ దత్ పేర్కొన్నారు.

అదిత్య థాకరే శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే పెద్ద కుమారుడు.  ‘ఆదిత్య నాకు చిన్న తమ్ముడు లాంటి వాడు. అతను ఉద్దండ నేత బాలసాహెబ్ థాకరే వంశం నుంచి వస్తున్నాడు. బాలాసాహెబ్ నాకు తండ్రి లాంటి వారు. అతను నన్ను, నా కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించారు. ఆయన్ని నేను ఎప్పటికీ మరిచిపోను. ఉద్దవ్ బాయ్ కూడా అంతే ప్రేమతో మమ్మల్ని అభిమానిస్తాడు’ అని 60 ఏళ్ల సంజయ్ పేర్కొన్నాడు.

  ‘ఆదిత్య గెలవాలని నేను కోరుకుంటున్నా. అదే జరుగుతుంది.  మనదేశానికి ధైర్యమున్న యువ నేతల అవసరముంది. జై హింద్, జై మహారాష్ట్ర’  అని సంజయ్ ట్వీట్ చేశారు.

తొలిసారిగా థాకరే కుటుంబం నుంచి..
1966 లో బాల్ థాకరే శివసేన స్థాపించిన నాటినుంచి ఇప్పటివరకు ఆ కుటుంబం నుంచి ఒక్కరు కూడా ఎన్నికల బరిలోకి దిగలేదు. రాజ్యాంగ బద్ధమైన పదవులను అధిష్ఠించలేదు. ఉద్దవ్ థాకరే కజిన్ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ ఎస్) చీఫ్ రాజ్ థాకరే 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోటీ చేస్తానని తొలుత ప్రకటించి అనంతరం విరమించుకున్నారు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...