హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేత కేటీఆర్
మరోమారు ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం కేటీఆర్ ఓ ట్వీట్
చేశారు. తమ నాయకుల నుంచి అందిన ఫీడ్ బ్యాక్ మేరకు హుజూర్ నగర్ లో టీఆర్ఎస్
అభ్యర్థి సైదిరెడ్డి గౌరవప్రదమైన మెజార్టీతో గెలవబోతున్నారన్న
నమ్ముతున్నానని అన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల నిమిత్తం గత నెల రోజులుగా
ఎంతగానో శ్రమించిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు తన కృతఙ్ఞతలు
తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Post a Comment