హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేత కేటీఆర్
మరోమారు ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం కేటీఆర్ ఓ ట్వీట్
చేశారు. తమ నాయకుల నుంచి అందిన ఫీడ్ బ్యాక్ మేరకు హుజూర్ నగర్ లో టీఆర్ఎస్
అభ్యర్థి సైదిరెడ్డి గౌరవప్రదమైన మెజార్టీతో గెలవబోతున్నారన్న
నమ్ముతున్నానని అన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల నిమిత్తం గత నెల రోజులుగా
ఎంతగానో శ్రమించిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు తన కృతఙ్ఞతలు
తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.
Comments
Post a Comment