ఎన్నికల ముందు హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి వ్యవహారంపై టీడీపీ నేత వర్ల రామయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. తన బాబాయిని చంపింది ఎవరో జగన్ కు తెలుసని, కానీ ఆయన వాళ్ల పేర్లను దాచిపెడుతున్నారని ఆరోపించారు. కేసు విచారణ కీలకదశలో ఉన్న తరుణంలో కడప ఎస్పీని బదిలీ చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. హంతకులు ఎవరన్నది ఎస్పీకి తెలుసని, అందుకే ఆయనను బదిలీపై పంపించి వేశారని తెలిపారు. ఎన్నికల ముందు విపక్షంలో ఉన్న జగన్ ఆ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారని, కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు.
మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...
Comments
Post a Comment