ఎన్నికల ముందు హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి వ్యవహారంపై టీడీపీ నేత వర్ల రామయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. తన బాబాయిని చంపింది ఎవరో జగన్ కు తెలుసని, కానీ ఆయన వాళ్ల పేర్లను దాచిపెడుతున్నారని ఆరోపించారు. కేసు విచారణ కీలకదశలో ఉన్న తరుణంలో కడప ఎస్పీని బదిలీ చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. హంతకులు ఎవరన్నది ఎస్పీకి తెలుసని, అందుకే ఆయనను బదిలీపై పంపించి వేశారని తెలిపారు. ఎన్నికల ముందు విపక్షంలో ఉన్న జగన్ ఆ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారని, కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు.
వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్పైవెళ్తున్న చాపర్తిన శేఖర్ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్ హైవే అంబులెన్స్ ద్వారా విజయవాడ ఈఎస్ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్ పక్కకు తొలగి అంబులెన్స్కు దారి ఇచ్చింది.
Comments
Post a Comment