Skip to main content

గడప గడపకూ అభివృద్ధి ఫలాలు: జగన్‌

 ప్రభుత్వ సేవలను నేరుగా ప్రజల వద్దకే తీసుకు వెళ్లి అందించేందుకు ఉద్దేశించిన గ్రామ, వార్డు సచివాలయాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కరప గ్రామంలో ముఖ్యమంత్రి జగన్‌ గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించారు. పైలాన్‌ ఆవిష్కరణ అనంతరం గ్రామ సచివాలయ ఉద్యోగులను సీఎం పలకరించారు. అంకితభావంతో పనిచేయాలని ఉద్యోగులకు జగన్‌ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 11,158 గ్రామ, 3,786 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఒక్కోచోట 12 మంది వరకూ ఉద్యోగులను నియమించింది.

ఈ సందర్భంగా జగన్‌ ప్రసంగించారు. ‘మహాత్మాగాంధీ అంటే అహింసా, సత్యాగ్రహం పదాలు గుర్తుకువస్తాయి. మహాత్ముడి ఆశయాలను అందరం స్మరించుకోవాలి. పరిపాలనలో అవినీతి లేకుండా చేయాలన్న తపనతోనే గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చాం. ఏ రాష్ట్రంలో జరగని విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థకు అంకురార్పణ చేశాం. ప్రతి గ్రామానికి 10 నుంచి 12 కొత్త ఉద్యోగాలను తీసుకువచ్చాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ ఉద్యోగం ఇచ్చాం. ఈ నాలుగు నెలల కాలంలోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మరెక్కడా జరిగి ఉండదు. తూర్పుగోదావరి జిల్లాలోనే 44,198 ఉద్యోగాలు ఇవ్వగలిగామంటే అది ఓ రికార్డు. ప్రతి గ్రామ వాలంటీర్‌కు స్మార్ట్‌ఫోన్‌ ఇస్తున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలి. ప్రతి ప్రభుత్వ పథకం నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వస్తుంది. గ్రామ సచివాలయాల పక్కనే దుకాణాలు తీసుకొస్తున్నాం. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ఆయా దుకాణాల్లోనే అందుబాటులో ఉంటాయి. ప్రతి గడపకు అభివృద్ధి ఫలాలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది’ అని జగన్‌ పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...