Skip to main content

రాఫెల్ యుద్ధ విమానంపై 'ఓం' రాశాను: రాజ్ నాథ్ సింగ్

 


రాఫెల్ యుద్ధ విమానంపై తాను 'ఓం' అని రాశానని, దానికి 'రక్షా బంధన్' కట్టానని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఈ రోజు ఆయన హర్యానాలోని కర్నాల్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కాంగ్రెస్ పార్టీ నేతలు తనపై చేసిన విమర్శలపై స్పందించారు. 'దేశంలో కాంగ్రెస్ నేతలు రాఫెల్ విషయంపై వివాదం రేపుతున్నారు. దేశానికి రాఫెల్ యుద్ధ విమానాలు వస్తున్న విషయాన్ని వారు స్వాగతించాల్సిందిపోయి, అందుకు విరుద్ధంగా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనలు పాకిస్థాన్ కు బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి' అని వ్యాఖ్యానించారు.

'మన వద్ద ఇప్పటికే రాఫెల్ యుద్ధ విమానాలు ఉంటే, ఉగ్రవాదులపై దాడులు జరపడానికి మనం బాలాకోట్ వరకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. అక్కడి ఉగ్రవాద శిబిరాలను మనం ఇక్కడి నుంచే రాఫెల్ యుద్ధ విమానాల ద్వారా నాశనం చేసే వాళ్లం' అని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. కాగా, ఇటీవల ఫ్రాన్స్ లో పర్యటించిన ఆయన.. తొలి రాఫెల్ విమానాన్ని అధికారికంగా అందుకుని, దానికి ఆయుధ పూజలు చేసిన విషయం తెలిసిందే. యుద్ధ విమానాలకు పూజలేంటంటూ దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...