కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి హైదరాబాదులోని చంచల్ గూడ జైలుకు వెళ్లనున్నారు. జైల్లో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ను పరామర్శించి, సంఘీభావం తెలపనున్నారు. టీవీ9 సీఈవోగా ఉన్న సమయంలో రవిప్రకాశ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, నిధులను అక్రమంగా దారి మళ్లించారంటూ ఆ ఛానల్ ప్రస్తుత యాజమాన్యం కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టగా... న్యాయమూర్తి రెండు వారాల జ్యుడీషియల్ కస్టడీని విధించారు. దీంతో, ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ నేతలు రవిప్రకాశ్ కు సంఘీభావం తెలుపుతున్నారు.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.
Comments
Post a Comment