Skip to main content

ట్రంప్‌కు మోదీ స్పష్టంగా చెప్పారు: అమిత్‌ షా

ట్రంప్‌కు మోదీ స్పష్టంగా చెప్పారు: అమిత్‌ షా
కశ్మీర్‌ వ్యవహారం పూర్తిగా భారత్‌ అంతర్గత వ్యవహారమనీ.. దీనిలో ఎవరి జోక్యమూ అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు స్పష్టంగా చెప్పారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మరోసారి వెల్లడించారు. కశ్మీర్‌లో ఎవరి జోక్యాన్ని సహించబోమని గత కొన్నేళ్లుగా తమ పార్టీ స్థిరమైన వైఖరితో ఉందన్నారు. ఒకవేళ ఏ దేశమైనా కశ్మీర్‌పై మాట్లాడితే.. అది పూర్తిగా భారత్‌ అంతర్గత వ్యవహారమనీ స్పష్టంగా చెప్పామనీ.. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇటీవల ట్రంప్‌కు ఇదే విషయాన్ని స్పష్టం చేశారని అమిత్‌ షా వివరించారు. మహారాష్ట్రలోని బుల్‌ధానాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో అమిత్‌ షా ప్రసంగించారు. ఆర్టికల్‌ 370 రద్దును కాంగ్రెస్‌, ఎన్సీపీ వ్యతిరేకించాయన్నారు. కశ్మీర్‌ అంశంపై ఆ రెండు పార్టీల వైఖరి ఏమిటో ఓటర్లే అడగాలని సూచించారు.

కశ్మీర్‌ను భారత్‌తో అనుసంధానించే ప్రక్రియకు ఆర్టికల్‌ 370 అనేది అతిపెద్ద అడ్డంకిగా ఉండేదన్నారు. దాన్ని రద్దుచేయడం ద్వారా గత 70 ఏళ్లుగా ఏ ప్రధాని చేయలేని సాహసాన్ని నరేంద్ర మోదీ చేశారని కొనియాడారు. ఆర్టికల్‌ 370 రద్దు చేస్తే నెత్తురు పారుతుందని కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ పార్లమెంట్‌లో అన్నారనీ.. అయితే, ఆర్టికల్‌ 370ని రద్దు చేశాక ఒక్క చుక్క రక్తంకూడా రాలేదని అమిత్‌ షా అన్నారు.

Comments

Popular posts from this blog

రేపు బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధికి సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ రేపు దసరా ఉత్సవాల్లో పాల్గొననున్నారు. శుక్రవారం సాయంత్రం ఇంద్రకీలాద్రికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం హోదాలో కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ మేరకు జగన్ షెడ్యూల్ లో మార్పులు చేశారు. ఎల్లుండి ఆయన ఢిల్లీ వెళుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త షెడ్యూల్ ప్రకారం, ప్రకాశం బ్యారేజ్ మీదుగా సీఎం అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఆలయ ప్రాంగణంలోని ఓంకారం వద్ద రాష్ట్ర మంత్రులు సీఎంకు స్వాగతం పలుకుతారు. ఆపై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. కాగా, సీఎం జగన్ అమ్మవారిని దర్శించుకునే సమయంలో వీఐపీ క్యూలైన్లను నిలిపివేస్తారు. సాధారణ, రూ.100 క్యూలైన్లు మాత్రం నడుస్తాయి. ఇక జగన్ పర్యటన సందర్భంగా ఘాట్ రోడ్డుపైకి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఎలాంటి వాహనాలను అనుమతించరు.

ఈ ప్రాజెక్టు ఏపీ పునర్విభజన చట్టం పరిధిలోకి రాదు: రేవంత్ రెడ్డి

  కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తాజాగా కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్ పరమేశంను కలిసి నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంపై వినతిపత్రం ఇచ్చారు. హైదరాబాదులోని జలసౌధ కార్యాలయానికి వెళ్లిన రేవంత్ రెడ్డి, జీవో 69 ద్వారా మంజూరు చేసిన నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను అపెక్స్ కౌన్సిల్ అజెండాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ఉమ్మడి రాష్ట్రంలో అన్ని అనుమతులు పొందిందని, ఎంతో తక్కువ ఖర్చుతో నికర జలాలను ఇవ్వగలిగిన ఈ ప్రాజెక్టును తొక్కిపెట్టి మీరు సాధించిందేమిటి? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో మీరు వేసిన కేసులోనూ ఈ ప్రాజెక్టు వివరాలు పొందుపరచకపోవడం మీ దుర్మార్గానికి పరాకాష్ఠ అంటూ మండిపడ్డారు. అంతేకాదు, ఈ ప్రాజెక్టు ఏపీ పునర్విభజన చట్టం పరిధిలోకి రాదని, పొరుగు రాష్ట్రాలేవీ దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని రేవంత్ స్పష్టం చేశారు.