Skip to main content

ట్రంప్‌కు మోదీ స్పష్టంగా చెప్పారు: అమిత్‌ షా

ట్రంప్‌కు మోదీ స్పష్టంగా చెప్పారు: అమిత్‌ షా
కశ్మీర్‌ వ్యవహారం పూర్తిగా భారత్‌ అంతర్గత వ్యవహారమనీ.. దీనిలో ఎవరి జోక్యమూ అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు స్పష్టంగా చెప్పారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మరోసారి వెల్లడించారు. కశ్మీర్‌లో ఎవరి జోక్యాన్ని సహించబోమని గత కొన్నేళ్లుగా తమ పార్టీ స్థిరమైన వైఖరితో ఉందన్నారు. ఒకవేళ ఏ దేశమైనా కశ్మీర్‌పై మాట్లాడితే.. అది పూర్తిగా భారత్‌ అంతర్గత వ్యవహారమనీ స్పష్టంగా చెప్పామనీ.. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇటీవల ట్రంప్‌కు ఇదే విషయాన్ని స్పష్టం చేశారని అమిత్‌ షా వివరించారు. మహారాష్ట్రలోని బుల్‌ధానాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో అమిత్‌ షా ప్రసంగించారు. ఆర్టికల్‌ 370 రద్దును కాంగ్రెస్‌, ఎన్సీపీ వ్యతిరేకించాయన్నారు. కశ్మీర్‌ అంశంపై ఆ రెండు పార్టీల వైఖరి ఏమిటో ఓటర్లే అడగాలని సూచించారు.

కశ్మీర్‌ను భారత్‌తో అనుసంధానించే ప్రక్రియకు ఆర్టికల్‌ 370 అనేది అతిపెద్ద అడ్డంకిగా ఉండేదన్నారు. దాన్ని రద్దుచేయడం ద్వారా గత 70 ఏళ్లుగా ఏ ప్రధాని చేయలేని సాహసాన్ని నరేంద్ర మోదీ చేశారని కొనియాడారు. ఆర్టికల్‌ 370 రద్దు చేస్తే నెత్తురు పారుతుందని కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ పార్లమెంట్‌లో అన్నారనీ.. అయితే, ఆర్టికల్‌ 370ని రద్దు చేశాక ఒక్క చుక్క రక్తంకూడా రాలేదని అమిత్‌ షా అన్నారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...