Skip to main content

వైఎస్ జగన్ గారూ, చేతకాని వాళ్లకు నోరు ఎక్కువంటారు... వీళ్లను చూసి గర్వపడతారో, సిగ్గుపడతారో మీ ఇష్టం: లోకేశ్ విమర్శలు

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఓ మీడియా చానల్ లో గ్రామ సచివాలయాల ఏర్పాటుపై చర్చ సందర్భంగా వైసీపీ నాయకుడు రెచ్చిపోయి మాట్లాడుతున్న వీడియోను లోకేశ్ తన ట్వీట్ లో ఉదహరించారు. "వైఎస్ జగన్ గారూ, చేతకానివాళ్లకు నోరు ఎక్కువంటారు. మీ తుగ్లక్ పనులను ఎలా సమర్థించుకోవాలో అర్థంకాక, మీ పార్టీ అధికార ప్రతినిధులు కిందామీదా పడుతున్నారు. టీవీలో తమను ప్రజలు చూస్తున్నారన్న ఇంగితం కూడా లేకుండా ఎలా మాట్లాడుతున్నారో చూడండి. వాళ్ల మాటలకు గర్వపడతారో, సిగ్గుపడతారో మీ ఇష్టం" అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...