తెలంగాణలో బంద్ కొనసాగుతోందని టీఎస్సార్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బంద్ కు మద్దతు ఇచ్చిన అన్ని వర్గాలకు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తున్న వారిని, అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని, అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు సాయంత్రం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Post a Comment