Skip to main content

రామేశ్వరం నుంచి శ్రీలంకకు.. కోటి రూపాయల విలువైన జలగల అక్రమ రవాణా

  రామేశ్వరం నుంచి శ్రీలంకకు పడవలో అక్రమంగా సముద్రపు జలగలను తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి కోటి రూపాయల విలువైన జలగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జలగలను శ్రీలంకకు అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో రామేశ్వరం పులిదేవన్‌నగర్ ప్రాంతంలోని ఓ తోటలో జలగలను దాచి ఉంచినట్టు తెలిసింది. దీంతో అక్కడకు చేరుకుని తనిఖీలు చేయగా మూడు ప్లాస్టిక్ క్యాన్లలో నిల్వచేసిన 150 కిలోల బరువున్న సముద్రపు జలగలు కనిపించాయి.

శ్రీలంకకు తరలించేందుకే అక్కడ దాచి ఉంచినట్టు గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని మురుగేశన్(37), మురుగయ్య (61), శక్తివేల్ (35) అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న జలగల విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...