Skip to main content

వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్..


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదివారం ఉదయం పోలీసులకు లొంగిపోయారు. తన ఇంటిపైకి వచ్చి ఎమ్మెల్యే బెదిరించి గొడవ చేసారని మహిళ ఎంపిడివో సరళ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు గత రాత్రి నుంచి ప్రయత్నాలు జరిగాయి. ఆయన ఇంటిదగ్గర హైడ్రామా జరిగింది. అర్ధరాత్రి దాటాక ఎమ్మెల్యే ఇంటిదగ్గర పోలీసులు అయన కోసం వేచి చూశారు. ఆయన లేకపోవడంతో రాత్రి మొత్తం అక్కడే ఉన్నారు.
కాగా ఈ ఉదయం కోటం రెడ్డి డైరెక్ట్ గా పోలీసులకు లొంగిపోయారు. రూరల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన ఆయనకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన్ను వెంకటాచలం పోలీస్ స్టేషన్ కు తరలించే అవకాశం ఉంది. ప్రైవేట్ అపార్ట్మెంట్ పంచాయితీ పైప్ లైన్ కోసం దరఖాస్తు చేసుకోగా, గ్రామ సచివాలయ పరీక్షల ఉన్నందువలన ఆయన దరఖాస్తుకు సంబంధించిన విషయాలను పరిశీలించేందుకు ఆలస్యం అయ్యింది. దీంతో ఆయన ఎంపిడివో ను బెదిరించారట. దీంతో ఆమె తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తప్పు చేస్తే ఎవరైనా సరే ఒక్కటే అని ముఖ్యమంత్రి నుంచి ముఖ్యమంత్రి జగన్ కూడా చెప్పడంతో ఆయనపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధం అయ్యారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...